యాప్నగరం

Government Employees: ప్రభుత్వ ఉద్యోగులకు Modi సర్కార్ శుభవార్త.. DA భారీగా పెంపు.. కోటి మందికిపైగా ప్రయోజనం!

Government Employees: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ (కరవు భత్యం) మరోసారి భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు డీఏ పెంచుతున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్. శుక్రవారం కేబినెట్ దీనికి ఆమోదముద్ర వేసింది. ఇక ప్రభుత్వం నిర్ణయంతో కోటి మందికిపైగా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 25 Mar 2023, 7:28 am
Government Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి డీఏను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా మరోసారి 4 శాతం DA (కరవు భత్యం) పెంచగా మొత్తం డీఏ ఇప్పుడు 42 శాతానికి చేరింది. అంతకుముందు ఇది 38 శాతంగా ఉండేది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ భేటీలో.. ఈ డీఏ పెంపునకు ఆమోదం లభించినట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్. 7వ వేతన సంఘం (7th Pay Commission) సిఫార్సులకు అనుగుణంగా డీఏ పెంపు జరిగిందని ఆయన తెలిపారు. కరవు భత్యం అదనపు విడత నిధుల విడుదల కేంద్రం ఆమోదముద్ర వేసిందని చెప్పారు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 47.58 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లు నేరుగా ప్రయోజనం పొందనున్నట్లు కేంద్రం వివరించింది.
Samayam Telugu DA HIKE


సవరించిన వేతనాలతోనే ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి వేతనాలు అందుతాయని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. అంటే వచ్చే నెలలోనే వీరి జీతం పెరగనుంది. అయితే జనవరిలో పెంపు ఉండగా ఆలస్యం అయినందున వారికి జనవరి, ఫిబ్రవరికి సంబంధించి అరియర్స్ (బకాయిలు) కూడా అందనున్నాయి. మొత్తం మూడు నెలలకు సంబంధించి డీఏ ఒకేసారి చెల్లిస్తారన్నమాట.

ఇక ఇప్పుడు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై రూ.12,815.60 కోట్ల మేర భారం పడనున్నట్లు అంచనా. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అనంతరం అనురాగ్ ఠాకుర్ చెప్పారు. ఇక చివరిసారి డీఏ పెంపును గతేడాది సెప్టెంబర్ 28న ప్రకటించింది కేంద్రం. అయితే అప్పుడు కూడా బకాయిలతో కలిపి జులై నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. అప్పుడు కూడా 4 శాతం పెంచడం విశేషం.

Gooty Pendekallu: AP ప్రజలకు గుడ్‌న్యూస్.. గుత్తి -పెండేకల్లు Railway Line డబ్లింగ్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! Hyderabad Property Sales: హైదరాబాద్‌లో ఇళ్లను తెగ కొంటున్న జనం.. ఇతర మెట్రో సిటీలను మించిన డిమాండ్.. ఎందుకో తెలుసా?

DA, DR పెంపును కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు సార్లు సవరించాల్సి ఉంటుంది. ఇక దీనిని ఏటా జనవరి, జులైల్లో చేపట్టాల్సి ఉండగా.. రెగ్యులర్‌గా మార్చి, సెప్టెంబర్‌లో నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. గతేడాది మార్చిలో 3 శాతం డీఏ పెంచగా 31 నుంచి 34 శాతానికి చేరింది. ఇక సెప్టెంబర్‌లో పెంపుతో 38 శాతానికి చేరింది. ఇప్పుడు మరో 4 శాతం పెంచగా అది 42 శాతానికి పెరిగింది. అయితే డీఏ పెంపు కోసం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

ఇదే కేబినెట్ సమావేశంలో కేంద్రం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ముడి జనపనార మినిమం సపోర్ట్ ప్రైస్ (కనీస మద్దతు ధర) క్వింటా రూ.4750 నుంచిరూ.5050కు పెంచింది. దీంతో 40 లక్షల మంది రైతులకు ప్రయోజనం దగ్గనున్నట్లు ఠాకుర్ చెప్పారు. ఇక ఒక్కో సిలిండర్‌పై ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉన్న లబ్ధిదారులకు ఇస్తున్న రూ.200 రాయితీని ఇంకో సంవత్సరం పొడగించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రతి సంవత్సరం 12 సిలిండర్లకు ఒక్కోదానిపై రూ.200 రాయితీ వర్తిస్తుంది.

Accenture: ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం.. భారత్‌లో వేలాది మందికి దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. ఇక కష్టమే! Ram Charan సతీమణి Upasana మరో ఘనత.. ఆసియా మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్‌గా..!

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.