యాప్నగరం

భారత మార్కెట్లోకి మరో చైనా బ్రాండ్!

చైనా అతిపెద్ద ఎలక్ట్రానిక్ కంపెనీల్లో ఒకటైన ఐవూమి (iVOOMi) భారత మార్కెట్‌లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది.

TNN 6 Mar 2017, 4:16 pm
చైనా అతిపెద్ద ఎలక్ట్రానిక్ కంపెనీల్లో ఒకటైన ఐవూమి (iVOOMi) భారత మార్కెట్‌లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లతో భారత మార్కెట్‌లోకి వస్తామని కంపెనీ సోమవారం ప్రకటించింది. కంపెనీ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్‌గా ఐవి505ను తీసుకొస్తామని తెలిపింది. ఈ నెలలోనే భారత మార్కెట్‌లోకి రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు రూ. 3,999.
Samayam Telugu chinas ivoomi readies for india foray with four budget smartphones
భారత మార్కెట్లోకి మరో చైనా బ్రాండ్!


ఐవూమి వినూత్న ఉత్పత్తులతో భారత మార్కెట్‌లో నిలదొక్కుకోవాలనే దృఢనిశ్చయంతో ఉన్నామని కంపెనీ గ్లోబల్ బిజినెస్ హెడ్ బ్రాడ్లే యాన్ వెల్లడించారు. సరసమైన ధరలకే అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్లను అందిస్తామని చెప్పారు. ఐవూమి నుంచి వస్తున్న తొలి మొబైల్ జియో నెట్‌వర్క్‌కు పూర్తిగా సహకరించేలా రెండు 4జీ వీవోఎల్‌టీఈ సిమ్ స్లాట్లతో వస్తోంది. ఫ్లాస్ ఛార్జ్ టెక్నాలజీ దీని ప్రత్యేకత. అలాగే ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆధారంగా కంపెనీ సొంత ఓఎస్ ‘స్మార్ట్‌మి’తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

భవిష్యత్తులో రూ. 4వేల నుంచి రూ. 10వేల శ్రేణిలో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయాలని ఐవూమి యోచిస్తోంది. కాగా, ఐవూమి ఐవి505 స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్ రిటైలర్ షాప్‌క్లూస్‌లో ప్రత్యేకంగా లభించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.