యాప్నగరం

భారత మార్కెట్లో చైనా బ్రాండ్ల హవా!

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకి వృద్ధి చెందుతోంది. గతేడాది డీమానిటైజేషన్‌తో డీలా పడ్డా మళ్లీ తేరుకుంది.

TNN 17 May 2017, 6:24 pm
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకి వృద్ధి చెందుతోంది. గతేడాది డీమానిటైజేషన్‌తో డీలా పడ్డా మళ్లీ తేరుకుంది. మార్చి 2017తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఏకంగా 2.7 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లో అమ్ముడుపోయాయి. దీంతో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ జనవరి-మార్చి త్రైమాసికంలో 4.7 శాతం వృద్ధి సాధించింది. గతేడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే ఇది 14.8 శాతం అధికం కావడం విశేషం.
Samayam Telugu chinese brands dominate the india smartphone market
భారత మార్కెట్లో చైనా బ్రాండ్ల హవా!


మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐడీసీ నివేదిక ప్రకారం.. భారత్‌లో చైనా కంపెనీలో అత్యధికంగా స్మార్ట్‌ఫోన్లను విక్రయించాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో చైనా కంపెనీల షేర్ 51.4 శాతంగా ఉంది. ఇక దేశీ కంపెనీలు అమ్మకాలు 40.5 శాతం నుంచి 13.5 శాతానికి పడిపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.