యాప్నగరం

Chinese Mobile Companies: భారత్‌ను వీడుతున్న చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు, కారణమేంటి?

Chinese Mobile Companies: చైనా కంపెనీల విషయంలో ఇటీవల భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తెలిసిందే. ఆ కంపెనీలు పన్ను ఎగవేతలు పాల్పడుతూ అక్రమ లావాదేవీలు చేపడుతూ ఉండటంతో.. భారత ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. అయితే భారత ప్రభుత్వం నుంచి ప్రస్తుతం ఒత్తిడి పెరగడంతో.. చైనా కంపెనీలు వేరే దేశాలను చూసుకుంటున్నాయి. భారత్‌ను వీడుతూ ఇతర దేశాలలో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

Authored byKoteru Sravani | Samayam Telugu 18 Sep 2022, 7:29 am

ప్రధానాంశాలు:

  • భారత్‌ను వీడుతున్న చైనీస్ మొబైల్ కంపెనీలు
  • ఇతర దేశాలలో తయారీ ప్లాంట్లు
  • గ్లోబల్ టైమ్స్ రిపోర్టు వెల్లడి
  • ఈజిప్ట్ ప్రభుత్వంతో ఒప్పో ఒప్పందం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vivo
వివో
Chinese Mobile Companies: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు భారత్‌ను వీడుతున్నాయి. ఈ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై భారత ప్రభుత్వం దూకుడు పెంచడంతో.. చైనీస్ మొబైల్ ఫోన్ కంపెనీలు భారత్‌ను వీడి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నాయి. భారత్ కాకుండా ఇతర దేశాలలో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఈ కంపెనీలు నిర్ణయించాయి. చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ప్రస్తుతం ఇండోనేషియా, బంగ్లాదేశ్, నైజీరియా దేశాలలో తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేయబోతున్నాయని భారత్‌లో చైనీస్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. ఈ విషయాన్ని గ్లోబల్ టైమ్స్ రిపోర్టు చేసింది.
భారత ప్రభుత్వం తీసుకుంటోన్న కఠిన చర్యలతో భారత్‌లో చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల మేనేజ్‌మెంట్ తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నట్టు ఆ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. అంతేకాక దేశీయ కంపెనీల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలు.. తమ ఎలక్ట్రానిక్స్‌ను దెబ్బకొడుతున్నట్టు కూడా పేర్కొన్నారు.

కాగా.. ఇటీవలే మొబైల్ ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో, ఈజిప్ట్‌లో 20 మిలియన్ డాలర్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ దేశ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు గ్లోబల్ టైమ్స్ చెప్పింది. ఈ డీలే భారత్ నుంచి చైనీస్ కంపెనీలు వైదొలుగుతున్నాయడానికి నిదర్శనమని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

Also Read : వారంలో రూ.850 తగ్గిన బంగారం ధర, ఇవాళ తులమెంత?
భారత ప్రభుత్వం గత కొన్నేళ్లుగా చైనీస్ కంపెనీలపై తీవ్రంగా వ్యవహరిస్తుంది. పన్ను ఎగవేత ఆరోపణలతో ఒప్పో, వివో ఇండియా, షియోమిలపై కేసులను నమోదు చేసేందుకు చూస్తోంది. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ కంపెనీలకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నోటీసులు కూడా జారీ చేసింది.

మరోవైపు చైనాకు చెందిన 300కి పైగా యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనిలో టెన్సెంట్‌కు చెందిన వీఛాట్, బైడ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్‌లున్నాయి. ప్రస్తుతం దేశీయ స్మార్ట్‌ఫోన్, చిప్ తయారీ రంగంపై కొరడా ఝుళిపిస్తోంది.

Also Read : అప్పులు లేని ప్రభుత్వ కంపెనీ.. 3 సార్లు బోనస్ జారీ.. ఇన్వెస్టర్లకు రూ.50 కోట్లు!

Read latest Business News and Telugu News

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.