యాప్నగరం

Chingari: గుడ్‌న్యూస్.. మహిళలకు ఆ టైంలో వేతనంతో కూడిన సెలవులు.. కంపెనీ గొప్ప మనసుతో ఫుల్ జోష్!

Chingari: భారత్‌కు చెందిన సోషల్ మీడియా కంపెనీ చింగారి గొప్ప నిర్ణయం తీసుకుంది. మహిళలు పడే ఇబ్బందులను ఎదుర్కొని, వారికి మరింత శక్తి నిచ్చేలా గొప్ప మనసుతో ఆలోచించింది. ఆ ప్రత్యేక సమయంలో మహిళలకు వేతనంతో కూడిన సెలవులను ప్రకటించింది. మళ్లీ నెలకు 2 రోజులు తీసుకోవచ్చు.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 6 Mar 2023, 7:19 pm
Chingari: ఇండియన్ ఆన్- చెయిన్ సోషల్ యాప్, చింగారి.. మార్చి 6న కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులకు రుతుక్రమం (menstruation) సమయంలో 2 రోజులు వేతనంతో కూడిన సెలవులను ప్రకటించింది. కంపెనీ కొత్త విధానం తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. పీరియడ్స్ సమయంలో మహిళలకు కలిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, వారు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చేలా వారికి శక్తినిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది చింగారి. మహిళల ఆరోగ్యం, సంక్షేమం కోసం.. రుతుక్రమ సెలవును తీసుకురావడం దాని విస్తృత ప్రయత్నంలో ఒక భాగం. ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు
Samayam Telugu chingari period leave


చింగారి రుతుక్రమ సెలవును స్వీకరించడం అనేది మహిళల ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం దాని విస్తృత ప్రయత్నంలో ఒక భాగం. #GARI4NARI ద్వారా, ఆపదలో ఉన్న మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా భారత మహిళలకు సాధికారత కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభమైన #GARI4NARI అనే సోషల్ మీడియా క్యాంపెయిన్‌ చింగారికి ప్రేరణ కలిగించిందంట. 2022లో ప్రారంభమైన ఈ ఇనిషియేటివ్ ద్వారా వేలాది మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారు.

మహిళలకు పని ప్రదేశంలో సాధికారత కల్పించడం ప్రాధాన్యం అర్థం చేసుకున్నట్లు చెప్పారు చింగారి కో ఫౌండర్, సీఈఓ సుమిత్ ఘోష్. వారికి మరింత మద్దతు కల్పించేందుకు, వారు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు మరింత సహకరించనున్నట్లు దానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇక మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా.. చింగారి ఉమెన్స్ బైక్ ర్యాలీ కూడా నిర్వహించనుంది.

Adanis Mundra Power: అదానీ కంపెనీకి అసలేమైంది.. మొత్తం ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ.. మరీ ఇలానా? Women's Day Special: మహిళలకు స్పెషల్ ఆఫర్.. స్పెషల్ స్కీమ్.. అందరికన్నా ఎక్కువ వడ్డీ!

ఇక మహిళలకు పీరియడ్స్ సమయంలో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరికి కేవలం అసౌకర్యంగానే ఉండొచ్చని.. ఇంకొందరికి విపరీతమైన నొప్పి ఉంటుందంట. కళ్లు తిరుగుతాయని ఇంకా వేరే డిజార్డర్స్ ఉంటే బాధ భరించలేకుండా ఉంటుందని, అప్పుడు మహిళలకు విశ్రాంతి అవసరమని వైద్యులు అంటున్నారు.

ఇక ఇప్పటికే పీరియడ్స్ సమయంలో మహిళలు నెలకు ఒక రోజు సెలవు తీసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ ఇటీవల ప్రకటించింది. అంతకుముందు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో.. 2020లో మహిళలకు పీరియడ్ లీవ్స్ ఇచ్చింది. తర్వాత 2021లో స్విగ్గీ కూడా మహిళలకు నెలకు 2 రోజులు టైమ్ ఆఫ్ ప్రకటించింది. బైజూస్ కూడా ఇదే బాటలో నెలకు ఒక రోజు సెలవు ఇస్తోంది.

Adani సంక్షోభం.. RBI మాజీ గవర్నర్ Raghuram Rajan రాజన్ సూటి ప్రశ్న ఇదే.. ఇక అలాగే చేయాలేమో? RBI Imposes Penalty: మరో సహకార బ్యాంక్‌పై RBI కొరడా.. SBI కంటే ఎక్కువ వడ్డీ ఇస్తుందనే కారణంతో..!

నిజం చెప్పాలంటే భారత దేశంలో పీరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడుకునేటు వంటి పరిస్థితులు ఇప్పటికీ లేవు. బట్టలకు మరకలు అంటుకుంటాయని భయం, శానిటరీ నాప్కిన్స్ కొనాలంటే మొహమాటం, అదేదో రహస్యం అన్నట్లు మెడికల్ షాప్స్‌లో వాటిని నల్లని కవర్‌లో చుట్టివ్వడం ఇలా ఎన్నో కారణాలుంటాయి. ఇంకా ఒక అధ్యయనం ప్రకారం.. భారత్‌లో 71 శాతం యుక్తవయసుకు వచ్చిన ఆడపిల్లలకు పీరియడ్స్ వచ్చే వరకు దాని గురించి తెలియకపోవడం గమనార్హం.
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.