విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మధ్యాహ్నం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సదస్సును ప్రారంభించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న భాగస్వామ్య సదస్సుకు 15దేశాల వాణిజ్య మంత్రులు హాజరుకానున్నారు. రూ.3 లక్షల కోట్ల ఒప్పందాలు లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతోంది. ఇందులో మొత్తం 18 దేశాల వాణిజ్య శాఖ ప్రతినిధులు నేరుగా పాల్గొంటుండగా మరో వైపు 80 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. 2000 మంది ఈ పార్ట్ నర్ షిప్ సమ్మిట్లో పాల్గొనేందుకు వచ్చారని సమాచారం. 800 నుంచి 1000 మంది ఆంధ్రప్రదేశ్ బయటివారే ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇది మన రాష్ట్రంలో జరుగుతున్న మూడో భాగస్వామ్య సదస్సు.
వివిధ ప్రభుత్వ, పారిశ్రామిక అధినేతలు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నారు. సీఐఐ తరపున ఆ సంస్థ ప్రతినిధి శోభన కామినేని పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం సంతోషం కలిగించిందన్నారు. ఏపీ చంద్రబాబు నాయడు దావోస్ సంఘటన గురించి ఆమె వివరించారు. అక్కడ అందరూ యువత పాల్గొంటుండగా ఆ సమావేశంలో చంద్రబాబు రాష్ట్రంలో వాడుతున్న టెక్నాలజీ గురించి వివరించడడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అక్కడ యువ సదస్సులో ఎవరో యువ పారిశ్రామిక వేత్త వచ్చి మాట్లాడతారని భావించానని, కానీ చంద్ర బాబు ఎంతో ఎనర్జీతో మాట్లాడటం ఆయనలో ఉన్న పారిశ్రామిక తృష్ణను బయటపెట్టిందన్నారు. నిజమైన టెక్ ఎంటర్ ప్రెన్యూర్లను తయారు చేయగల సత్తా ఆయనకు ఉందని చెప్పారు. ముఖ్యంగా కొత్త టెక్నాలజీల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ సరికొత్త మార్పుకు నాంది పలకగలదన్నారు. సీఐఐ, భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పెట్టుబడులను పెడుతూ, ఉపాధి కల్పించేందుకు ముందుకు సాగుతోందని చెప్పారు.
వివిధ ప్రభుత్వ, పారిశ్రామిక అధినేతలు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నారు. సీఐఐ తరపున ఆ సంస్థ ప్రతినిధి శోభన కామినేని పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం సంతోషం కలిగించిందన్నారు. ఏపీ చంద్రబాబు నాయడు దావోస్ సంఘటన గురించి ఆమె వివరించారు. అక్కడ అందరూ యువత పాల్గొంటుండగా ఆ సమావేశంలో చంద్రబాబు రాష్ట్రంలో వాడుతున్న టెక్నాలజీ గురించి వివరించడడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అక్కడ యువ సదస్సులో ఎవరో యువ పారిశ్రామిక వేత్త వచ్చి మాట్లాడతారని భావించానని, కానీ చంద్ర బాబు ఎంతో ఎనర్జీతో మాట్లాడటం ఆయనలో ఉన్న పారిశ్రామిక తృష్ణను బయటపెట్టిందన్నారు. నిజమైన టెక్ ఎంటర్ ప్రెన్యూర్లను తయారు చేయగల సత్తా ఆయనకు ఉందని చెప్పారు. ముఖ్యంగా కొత్త టెక్నాలజీల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ సరికొత్త మార్పుకు నాంది పలకగలదన్నారు. సీఐఐ, భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పెట్టుబడులను పెడుతూ, ఉపాధి కల్పించేందుకు ముందుకు సాగుతోందని చెప్పారు.