యాప్నగరం

ఉద్యోగులకు కేంద్రం షాక్.. డీఏ పెంపు నిలిపేత.. ఎప్పటి దాకా అంటే?

కరోనా వైరస్ ప్రభావంతో ఆదాయం భారీగా తగ్గిన వేళ మోదీ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. డియర్నెస్ అలవెన్స్‌ పెంపును వచ్చే ఏడాది జూలై వరకు నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 23 Apr 2020, 3:02 pm
కరోనా, లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది డీఏ (అధిక ధరల భత్యం) పెంపును నిలిపివేయాలని నిర్ణయించింది. వాస్తవానికి మార్చి రెండో వారంలోనే డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) 4 శాతం పెంచుతూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి పెంచిన 4 శాతం డీఏకు ఏప్రిల్ నెల వేతనంలో అరియర్స్ రావాల్సి ఉంది. కానీ 2020 జూన్ చివరి వరకు అరియర్స్ చెల్లించడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. డీఏ పెంపును నిలిపేయడంతో.. ఇక మీదట కూడా ఇప్పటి లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు 17 శాతం డీఏ అందనుంది.
Samayam Telugu No DA Hike


కేంద్రం ఏడాదికి రెండు సార్లు డీఏను పెంచుతూ ఉంటుంది. పెంచిన డీఏ జనవరి 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. డీఏ పెంచితే భారీ సంఖ్యలో 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలిగేది. కానీ కరోనా ప్రభావంతో పన్నుల ఆదాయం తగ్గిపోవడంతో.. పెంచిన డీఏను నిలిపేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

జూలై 1, 2020 నాటి డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ ఇన్‌స్టాల్‌మెంట్లతోపాటు జనవరి 1, 2021 నాటి ఇన్‌స్టాల్‌మెంట్లు కూడా చెల్లించడం కుదరదని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2021 జూలై నుంచి డీఏ పెంపు ఉంటుంది. కానీ ఈ కాలానికి అరియర్స్ చెల్లించడం కుదరదని కేద్రం స్పష్టం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.