యాప్నగరం

Food Crisis : 80 కోట్ల మంది ప్రతి రాత్రి పస్తులుంటున్నారు... సంచలన విషయాలు వెలుగులోకి

రష్యా-ఉక్రెయిన్ మధ్య సంక్షోభం ప్రారంభమైన తర్వాత.. ఎంతో మంది ఎన్నో రాత్రులు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కోట్లాది మంది ప్రజలు రాత్రి పూట భోజనం చేయకుండానే పడుకుంటున్నారని సంచలన విషయలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంక్షోభం తర్వాత పెరుగుతోన్న ధరలను నియంత్రించేందుకు తమ దేశాలలో పండే ఆహార ఉత్పత్తులపై ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ ఆంక్షలతో ఆహార ధరలు భగ్గుమంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార అభద్రత ఏర్పడింది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది డబ్ల్యూఈఎఫ్.

Authored byKoteru Sravani | Samayam Telugu 25 May 2022, 1:19 pm

ప్రధానాంశాలు:

  • ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆహార సంక్షోభం
  • డబ్ల్యూఈఎఫ్‌ మీటింగ్‌లో వెలుగులోకి సంచలన విషయాలు
  • కోట్లాది మంది ప్రజలు పస్తులుండేలా చేస్తోంది
  • సమస్యకు పరిష్కారం కనుగొనాలంటూ ప్రపంచదేశాలకు పిలుపు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Food Crisis
తీవ్రమైన ఆహార సంక్షోభం
Food Crisis : ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం తీవ్రమైంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం ప్రారంభించిన తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆహార సంక్షోభంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి వివిధ దేశాలకు చెందిన నిపుణులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో 80 కోట్ల మంది ప్రజలు ప్రతి రాత్రి ఆకలితోనే పడుకుంటున్నారని ఈ సమావేశంలో తెలిసింది. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆహార అభద్రత ఏర్పడింది. సరఫరా గొలుసుల్లో అనిశ్చితకర పరిస్థితులు తలెత్తాయి. రసాయనాల ధరలు విపరీతంగా పెరిగాయి. తమ దేశాలలో పెరుగుతోన్న ధరలను నియంత్రించేందుకు ఎగుమతులపై నిషేధం విధిస్తున్నాయి ప్రభుత్వాలు. వీటి మూలంగా ఆహార సంక్షోభం తీవ్రమై.. కోట్లాది మంది ప్రజలు పస్తులుండేలా చేస్తుందని ఈ సమావేశానికి హాజరైన నిపుణులు, ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆహార అభద్రత కేవలం ప్రజారోగ్యంపైనే కాక.. భౌగోళిక రాజకీయ, భద్రతా సమస్యలను కూడా సృష్టిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో పాల్గొన్న నిపుణులు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆహార సమస్యలు, వాతావరణ సంక్షోభంపై చర్చించారు. ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుకు, ఆహార భద్రతకు వ్యవసాయం ఒక పరిష్కారమని సింజెంటా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జై ఎరిక్ ఫీయర్‌వాల్డ్ అన్నారు. తక్కువ భూమిలోనే ఎక్కువ ఆహారాన్ని పండించాలన్నది తమ ధ్యేయమని చెప్పారు. దీని కోసం రైతులు సేంద్రీయ, సంప్రదాయ వ్యవసాయంతో ఉన్నతమైన విధానాలను అనుసరించాలని సూచించారు.

Also Read :Edible Oil Prices: గుడ్ న్యూస్.. దిగిరానున్న వంట నూనెల ధరలు?


ప్రపంచ ఆహార భద్రతను మెరుగుపరచడంలో జపాన్ కీలక పాత్ర పోషించనుందని కొందరు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. కానీ వ్యవసాయ ఉత్పత్తిని మెరుగుపర్చడంలో ఎన్నో సవాళ్లను ఈ ప్రాంతం ఎదుర్కొంటుందని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తిని మెరుగుపర్చాల్సి ఉందని టాంజానియా వైస్ ప్రెసిడెంట్ అన్నారు. అగ్రికల్చర్ వాల్యూ చెయిన్‌లో యువత కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఈ విషయంలో ధనిక, అభివృద్ధి చెందుతోన్న దేశాలన్ని కీలక పాత్ర పోషించనున్నాయని యూఏఈ మంత్రి చెప్పారు. ప్రపంచ జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలను అందించాలంటే 2025 నాటికి ఆహారోత్పత్తిని 60 శాతానికి పైగా పెంచాల్సి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ఆహార సంక్షోభానికి పరిష్కారం కనుగొనడమన్నది ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు.

Also Read : Top Trending Stock : ఈ బ్యాంకు షేరు బంపర్ రిటర్న్స్.. టాప్ గెయినర్లలో ఒకటి ఇదే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.