యాప్నగరం

షాకింగ్.. కొత్త నోట్లలో ముద్రణ లోపాలు

మార్కెట్లోకి విడుదల చేసిన కొత్త రూ.500 నోట్లలో ముద్రణ లోపాలు ఉన్నాయని ఆర్‌బీఐ అంగీకరించింది.

TNN 25 Nov 2016, 10:37 am
కొత్త రూ.500 నోట్లను వాడుకలోకి తెచ్చిన రెండు వారాల్లోనే వాటిలో ముద్రణా లోపాలు ఉన్నట్లు ఆర్‌బీఐ అంగీకరించింది. కొత్త నోట్లను ఒకదానితో మరొకటి పోల్చి చూసినప్పుడు అవి విభిన్నంగా ఉన్న విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వెలుగులోకి తీసుకొచ్చింది. కొన్ని నోట్లలో గాంధీ ముఖంపై నీడ ఎక్కువగా ఉందని, గాంధీ చెవి పక్కన ఉన్న రూ.500 సింబల్ కొన్ని నోట్లపై గాంధీకి దగ్గరగా, కొన్ని నోట్లపై దూరంగా ఉందని గుర్తించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఇంగ్లిష్ అక్షరాలు కూడా ఒక్కో నోటుపై ఒక్కో రీతిన ఉన్నాయి. నోటుపై ఉన్న జాతీయ చిహ్నం విషయంలో అలైన్‌మెంట్ సమస్యలు కూడా ఉన్నాయి. నోట్ల బోర్డర్ సైజులు కూడా వేర్వేరుగా ఉన్నాయి. రెండు నోట్లను పోల్చి చూసినప్పుడు అవి వేర్వేరు రంగుల్లో ఉండటాన్ని కొందరు వ్యక్తులు గమనించారు.
Samayam Telugu defects in new rs 500 notes rbi says printing defect due to rush
షాకింగ్.. కొత్త నోట్లలో ముద్రణ లోపాలు


డిమాండ్‌కు సరిపడా నోట్లను అందించే ఉద్దేశంతో వేగంగా ప్రింటింగ్ జరుపుతున్నామని, అందుకే కొత్త నోట్లలో ముద్రణ లోపాలు తలెత్తాయని రిజర్వ్ బ్యాంక్ అధికార ప్రతినిధి అల్పనా కిలావాల తెలిపారు. అయితే ఇది ఇబ్బందేం కాదని, అంతగా వద్దనుకుంటే వాటిని ఆర్‌బీఐకి తిరిగి ఇచ్చేయవచ్చని ఆయన సూచించారు. కొత్త నోట్లు ఇలా ఒకదానికొకటి విభిన్నంగా ఉంటుండటంతో తికమకు గురైన జనం అవి దొంగనోట్లని ఆందోళన చెందుతున్నారు. ప్రింటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్‌బీఐని కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.