యాప్నగరం

ఊపందుకున్న ఆన్‌లైన్ కిరాణా వ్యాపారం

మోదీ ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

TNN 28 Nov 2016, 6:56 pm
మోదీ ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. డబ్బుల కోసం జనం ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. కొన్ని గంటల పాటు క్యూలో నిలుచుని ఏటీఎం డబ్బా వరకు వెళ్తే అందులో డబ్బులు కాస్త ఆవిరైపోతున్నాయి. జేబుల్లో డబ్బులు లేక చాలా మంది డెబిట్, క్రెడిట్ కార్డులపైనే ఆధారపడుతున్నారు.
Samayam Telugu demonetisation almost 35 jump in grocery websites business
ఊపందుకున్న ఆన్‌లైన్ కిరాణా వ్యాపారం


జేబులో చిల్లర డబ్బులు లేకపోవడం, కొత్తగా వచ్చిన రూ. 2000 బయట చిల్లర దొరకక పోవడంతో బజారుకు వెళ్లి కూరగాయలు కొనేవారు ఇప్పుడు సూపర్ మార్కెట్‌కి వెళ్లి తెచ్చుకుంటున్నారు. కిరాణా దుకాణానికి వెళ్లి సామానులు కొనడానికి సరిపడా డబ్బులు లేక ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇన్నాళ్లూ ఈసోరమని నడిచిన ఆన్‌లైన్ గ్రాసరీ బిజినెస్ ఇప్పుడు ఊపందుకుంది. బిగ్ బాస్కెట్, గ్రోఫెర్స్ వంటి ఈ-గ్రాసెర్స్‌లో కిరాణా సరుకులు బుక్‌చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. గతంతో పోలిస్తే ఈ ఆన్‌లైన్ కిరాణా దుకాణాల్లో వ్యాపారం 35 శాతం పెరిగింది. స్మార్ట్‌ఫోన్ ఉండి, కాస్తో కూస్తో ఆన్‌లైన్ మార్కెట్ మీద అవగాహన ఉన్నవాళ్లు ఈ-గ్రాసర్స్‌నే ఆశ్రయిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.