యాప్నగరం

దేశీ ఫోన్ పరిశ్రమకు ‘నోటు’ దెబ్బ

రద్దు చేసిన రూ. 500, రూ. 1000 నోట్లతో వినియోగదారులు ఫోన్‌లు కొనుగోలు చేసుకునే సదుపాయాన్ని అందించాలని దేశీ మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాయి.

TNN 28 Nov 2016, 3:05 pm
రద్దు చేసిన రూ. 500, రూ. 1000 నోట్లతో వినియోగదారులు ఫోన్‌లు కొనుగోలు చేసుకునే సదుపాయాన్ని అందించాలని దేశీ మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాయి. ఫోన్ల కొనుగోలుపై మరో నెలపాటు ఈ నోట్లు చెల్లుబాటయ్యేలా అనుమతి ఇవ్వాలని కోరాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశీ ఫోన్ల పరిశ్రమ ఆదాయం 50శాతం మేర పడిపోయిందని ప్రభుత్వానికి వివరించాయి. నోట్ల రద్దు వల్ల దేశీ కంపెనీలైన మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, కార్బన్, లావా, సెల్‌కాన్ వంటి కంపెనీల ఆదాయం రూ. 175 నుంచి రూ. 200 కోట్ల వరకు పడిపోయింది.
Samayam Telugu demonitisation domestic handset makers ask government to allow use of old currency notes
దేశీ ఫోన్ పరిశ్రమకు ‘నోటు’ దెబ్బ


ఈ మేరకు టెలీకాం, ఐటీ, ఆర్థిక మంత్రిత్వ శాఖలకు ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ ప్రతిపాదనలను పంపింది. విక్రయాల్లో ఎలాంటి దుర్వినియోగం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, సరైనా ఆధార్ లేదా ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నవారికే ఫోన్‌లు విక్రయిస్తామని తమ ప్రతిపాదనలో పేర్కొంది. విక్రయించిన ప్రతీ ఫోన్‌ను ఐఎంఈఐ నంబర్ ద్వారా ట్రేస్ చేయొచ్చని కూడా వెల్లడించింది. మరి దీనికి ప్రభుత్వం అనుమతిస్తోందో లేదో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.