భారత బ్యాంకింగ్ రంగంలో అతి పెద్ద ఐపీవో ఈనెల 15న ప్రారంభం కానుంది. ఈ నెల 19న ముగిసే ఈ ఇష్యూ ద్వారా రూ.4430-4473 కోట్ల నిధులను సమీకరించే యోచనలో ఉన్నట్లు బంధన్ బ్యాంక్ ప్రకటించింది. ప్రైస్బాండ్ ఒక్కో షేరుకు రూ.370-375 కాగా.. జారీలో భాగంగా 11.92 కోట్ల ఈక్విటీ షేర్లను బంధన్ బ్యాంక్ జారీ చేయనుంది. కొత్తగా జారీ చేసే 9.76 కోట్ల షేర్లతో పాటు ఇప్పటికే సంస్థలో వాటా ఉన్న రెండు సంస్థలకు సంబంధించిన షేర్లను జారీ చేయనున్నారు. ఈ ఇష్యూకు కనీసం 40 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయాలి. ఈ ఇష్యూకు యాక్సిస్ బ్యాంక్, గోల్డ్మన్ శాక్స్, జేపీ మోర్గాన్ ఇండియా ప్రై.లి., జేఎం ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
కంపెనీ నేపథ్యం :
కోల్కతాలో మైక్రోఫైనాన్స్ సంస్థగా ప్రారంభమైన బంధన్.. ఆ తర్వాత తన కార్యకలాపాలను విస్తరించింది. 2014 ఏప్రిల్లో బ్యాంకింగ్ లైసెన్స్ను సంపాదించింది. 2015 ఆగస్టులో బ్యాంకింగ్ కార్యకలాపాలను ఈ సంస్థ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరించాలనే లక్ష్యంతో ఉన్న ఈ సంస్థ ప్రస్తుతం కోటి మంది సూక్ష్మ రుణ కస్టమర్లను కలిగివుంది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రకాల వినియోగదారులకు సేవలందించేందుకు భారత ప్రభుత్వ, ఆర్బీఐ నుంచి అనుమతి పొందింది. ప్రస్తుతం 864 బ్రాంచ్లు, 386 ఏటీఎంలను బంధన్ బ్యాంక్ కలిగివుంది. ఇందులో 70 శాతానికి పైగా బ్రాంచీలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. పశ్చిమబెంగాల్, అస్సాం, బీహార్లతో పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బ్యాంక్కు పటిష్టమైన నెట్వర్క్ వుంది. ఈ బ్యాంకుకు 18.7లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఈ బ్యాంకు సూక్ష్మ రుణాలు, ఎస్ఎంఈ రుణాలు, చిన్న వ్యాపారులకు రుణాలు ఇచ్చే కార్యకలాపాల్లో ఎక్కువగా నిమగ్నమై ఉంది.
కంపెనీ నేపథ్యం :
కోల్కతాలో మైక్రోఫైనాన్స్ సంస్థగా ప్రారంభమైన బంధన్.. ఆ తర్వాత తన కార్యకలాపాలను విస్తరించింది. 2014 ఏప్రిల్లో బ్యాంకింగ్ లైసెన్స్ను సంపాదించింది. 2015 ఆగస్టులో బ్యాంకింగ్ కార్యకలాపాలను ఈ సంస్థ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరించాలనే లక్ష్యంతో ఉన్న ఈ సంస్థ ప్రస్తుతం కోటి మంది సూక్ష్మ రుణ కస్టమర్లను కలిగివుంది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రకాల వినియోగదారులకు సేవలందించేందుకు భారత ప్రభుత్వ, ఆర్బీఐ నుంచి అనుమతి పొందింది. ప్రస్తుతం 864 బ్రాంచ్లు, 386 ఏటీఎంలను బంధన్ బ్యాంక్ కలిగివుంది. ఇందులో 70 శాతానికి పైగా బ్రాంచీలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. పశ్చిమబెంగాల్, అస్సాం, బీహార్లతో పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బ్యాంక్కు పటిష్టమైన నెట్వర్క్ వుంది. ఈ బ్యాంకుకు 18.7లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఈ బ్యాంకు సూక్ష్మ రుణాలు, ఎస్ఎంఈ రుణాలు, చిన్న వ్యాపారులకు రుణాలు ఇచ్చే కార్యకలాపాల్లో ఎక్కువగా నిమగ్నమై ఉంది.