యాప్నగరం

ఆ రెండు బ్యాంకుల డిపాజిటర్లకు రూ.5 లక్షలు.. వచ్చే నెలలోనే చెల్లింపులు

కోఆపరేటివ్ బ్యాంకులు ఈ మధ్యన ఆర్‌బీఐ ఆంక్షలు ఎదుర్కొంటున్నాయి. సరియైన వ్యాపార నిర్వహణ చేయలేక చేతులెత్తేస్తున్నాయి. దీంతో ఈ బ్యాంకులలో డబ్బులు పెట్టిన వారు పూర్తిగా ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు.. ఆర్‌బీఐ తన డిపాజిట్ ఇన్సూరెన్స్ సంస్థ డీఐసీజీసీ ద్వారా వారికి ఇన్సూరెన్స్ కవర్‌ను అందిస్తోంది. మహారాష్ట్రకు చెందిన రెండు కోఆపరేటివ్ బ్యాంకులకు వచ్చే నెలలో ఈ ఇన్సూరెన్స్ కవర్‌ను అందిస్తామని డీఐసీజీసీ తెలిపింది.

Authored byKoteru Sravani | Samayam Telugu 3 Jul 2022, 5:12 pm

ప్రధానాంశాలు:

  • శంకర్ రావు పూజారి, హరిహరేశ్వర్ సహకారి బ్యాంకులపై ఆర్‌బీఐ ఆంక్షలు
  • ఈ రెండు కోఆపరేటివ్ బ్యాంకుల డిపాజిటర్లకు ఇన్సూరెన్స్ చెల్లింపులు
  • రూ.5 లక్షల వరకు అందించనున్న డీఐసీజీఐ
  • ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో.. ఆంక్షలు విధించిన సెంట్రల్ బ్యాంకు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu DICGC
మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకుల డిపాజిటర్లకు డీఐసీజీసీ చెల్లింపులు
శంకర్ రావు పూజారి నూతన్ సహకారి బ్యాంకు-ఇచల్కరంజి, హరిహరేశ్వర్ సహకారి బ్యాంకు, వైలకు చెందిన అర్హత కలిగిన డిపాజిటర్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) వచ్చే నెలలో పేమెంట్లను చేయనుంది. మహారాష్ట్రకు చెందిన ఈ రెండు బ్యాంకుల డిపాజిటర్లకు వారు ఇచ్చిన ప్రత్యామ్నాయ బ్యాంకు అకౌంట్లకు, ఆధార్ లింక్డ్ బ్యాంకు అకౌంట్లకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ మనీని క్రెడిట్ చేయనున్నట్టు డీఐసీజీసీ తెలిపింది. డీఐసీజీసీ అనేది ఆర్‌బీఐకి చెందిన సబ్సిడరీ. ఇది బ్యాంకు డిపాజిట్లకు రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్‌ను అందిస్తుంది.
శంకర్ రావు పూజారి నూతన్ సహకారి బ్యాంకుకు చెందిన అర్హులైన డిపాజిటర్లకు ఆగస్టు 10న చెల్లింపులు జరుగుతాయని, హరిహరేశ్వర్ సహకారి బ్యాంకుకు చెందిన కస్టమర్లకు ఆగస్టు 28న చెల్లింపులు చేస్తామని డీఐసీజీసీ తన సర్క్యూలర్‌లో తెలిపింది.

Also read : Post Office Scheme: ప్రతి నెలా రూ.2,500 కావాలా..? అయితే ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి!

ఈ రెండు బ్యాంకుల ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో.. ఈ రెండు బ్యాంకుల నుంచి డిపాజిట్లు, విత్ డ్రాయల్స్ చేపట్టకుండా మే నెలలో ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. శంకర్ రావు పూజారి నూతన్ సహకారి బ్యాంకుపై ఆంక్షలు విధించిన ఆర్‌బీఐ ఈ బ్యాంకుకు చెందిన 99.84 శాతం డిపాజిటర్లు డీఐసీజీసీ ఇన్సూరెన్స్ స్కీమ్ కిందకు వస్తారని తెలిపింది. అలాగే హరిహరేశ్వర్ సహకారి బ్యాంకుకు చెందిన 99.59 శాతం మందికి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తిస్తుందని పేర్కొంది.

డీఐసీజీసీ అందించే డిపాజిట్ ఇన్సూరెన్స్ దేశంలో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న అన్ని కమర్షియల్ బ్యాంకులకు, స్థానిక బ్యాంకులకు, రీజనల్ రూరల్ బ్యాంకులకు, కోఆపరేటివ్ బ్యాంకులకు వర్తిస్తుంది. బ్యాంకులు దివాలా తీసినప్పుడు లేదా వాటి లైసెన్సులు రద్దయినప్పుడు.. బ్యాంకులలో డబ్బులు పెట్టిన కస్టమర్లు నష్టపోకుండా ఉండేందుకు రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.

Also read : పీఎన్‌బీ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.