కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ‘డిజి యాత్ర’ సౌకర్యం మరో రెండు నెలల్లో అమలులోకి రానుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఈ విషయం వెల్లడించారు. ‘డిజి యాత్ర’ సౌకర్యం వల్ల ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణం వేగవంతం అవుతుంది. దీనివల్ల విమానయానంలో కాగితం వినియోగాన్ని తగ్గించనున్నారు. డిజిటల్ వ్యవస్థ కింద ప్రయాణికులు విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి, విమానం ఎక్కడానికి సదరు ప్రయాణికుల ఆధార్ నంబర్ను, మొబైల్ నంబర్ను వినియోగిస్తారు.
ఈ వ్యవస్థ కింద డిజిటల్ రూపంలోనే టికెట్ బుకింగ్, ఎయిర్పోర్ట్ ఎంట్రీ, బోర్డింగ్ పాస్, సెక్యూరిటి చెకింగ్ను నిర్వహించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ భావిస్తోంది. ‘మేము రానున్న రోజుల్లో డిజి యాత్ర పేరిట సరికొత్త డిజిటల్ వ్యవస్థను తీసుకు వస్తున్నాం. రానున్న రెండు నెలల్లోనే దీనిని ప్రారంభిస్తామనే విశ్వాసంతో ఉన్నాం’ అని ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు.
‘డిజి యాత్ర’ ద్వారా ఏం చేస్తారు?
ఈ ‘డిజి యాత్ర’ వ్యవస్థ కింద ప్రయాణికులు విమానాశ్రయంలోకి అడుగుపెట్టిన తరువాత వారి ఫేసియల్ లేదా ఐరిష్ బయోమెట్రిక్ను తీసుకుంటారు. ఆ తరువాత సదరు ప్రయాణికులు జీవితంలో మరెప్పుడైనా సెక్యూరిటి చెకింగ్ లేకుండానే విమానయానం చేయవచ్చు’ అని మంత్రి వివరించారు. అయితే, ప్రజల గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ప్రభుత్వం అనుసరిస్తుందని, ‘డిజి యాత్ర’ అమలు సందర్భంగా వాటిని ఉల్లంఘించబోదని మంత్రి వివరించారు.
‘డిజి యాత్ర’ అనేది ఒక ఆప్షన్గా మాత్రమే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘డిజి యాత్ర అనేది కేవలం ఆధార్ ఆధారంగా మాత్రమే పనిచేసేది కాదు. ఏదైనా గుర్తింపును చూపించొచ్చు. ఒకసారి మీరు మీ గుర్తింపును చూపించినట్లయితే, మీరు జీవితమంతా ఎప్పుడైనా విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు’ అని సురేశ్ ప్రభు చెప్పారు. ‘ఈ డిజి యాత్ర అనేది ప్రయాణికుల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైనా ప్రయాణికులు తమ గుర్తింపును వెల్లడించడానికి ఇష్టం లేకపోతే, వారు మామూలు పద్ధతిలో విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు. మేము సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించబోము’ అని మంత్రి పేర్కొన్నారు.
ఈ వ్యవస్థ కింద డిజిటల్ రూపంలోనే టికెట్ బుకింగ్, ఎయిర్పోర్ట్ ఎంట్రీ, బోర్డింగ్ పాస్, సెక్యూరిటి చెకింగ్ను నిర్వహించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ భావిస్తోంది. ‘మేము రానున్న రోజుల్లో డిజి యాత్ర పేరిట సరికొత్త డిజిటల్ వ్యవస్థను తీసుకు వస్తున్నాం. రానున్న రెండు నెలల్లోనే దీనిని ప్రారంభిస్తామనే విశ్వాసంతో ఉన్నాం’ అని ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు.
‘డిజి యాత్ర’ ద్వారా ఏం చేస్తారు?
ఈ ‘డిజి యాత్ర’ వ్యవస్థ కింద ప్రయాణికులు విమానాశ్రయంలోకి అడుగుపెట్టిన తరువాత వారి ఫేసియల్ లేదా ఐరిష్ బయోమెట్రిక్ను తీసుకుంటారు. ఆ తరువాత సదరు ప్రయాణికులు జీవితంలో మరెప్పుడైనా సెక్యూరిటి చెకింగ్ లేకుండానే విమానయానం చేయవచ్చు’ అని మంత్రి వివరించారు. అయితే, ప్రజల గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ప్రభుత్వం అనుసరిస్తుందని, ‘డిజి యాత్ర’ అమలు సందర్భంగా వాటిని ఉల్లంఘించబోదని మంత్రి వివరించారు.
‘డిజి యాత్ర’ అనేది ఒక ఆప్షన్గా మాత్రమే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘డిజి యాత్ర అనేది కేవలం ఆధార్ ఆధారంగా మాత్రమే పనిచేసేది కాదు. ఏదైనా గుర్తింపును చూపించొచ్చు. ఒకసారి మీరు మీ గుర్తింపును చూపించినట్లయితే, మీరు జీవితమంతా ఎప్పుడైనా విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు’ అని సురేశ్ ప్రభు చెప్పారు. ‘ఈ డిజి యాత్ర అనేది ప్రయాణికుల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైనా ప్రయాణికులు తమ గుర్తింపును వెల్లడించడానికి ఇష్టం లేకపోతే, వారు మామూలు పద్ధతిలో విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు. మేము సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించబోము’ అని మంత్రి పేర్కొన్నారు.