యాప్నగరం

బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక.. వెంటనే ఇలా చేయండి.. లేదంటే రూ.1000 జరిమానా!

మీకు బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? పాన్ కార్డు కలిగి ఉన్నారా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంకులు ఇప్పుడు కస్టమర్లకు మెసేజ్‌లు పంపుతున్నాయి. పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలని కోరుతున్నాయి.

Samayam Telugu 13 May 2021, 1:52 pm

ప్రధానాంశాలు:

  • బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్
  • కస్టమర్లకు ఎస్ఎంఎస్‌లు
  • వెంటనే అలా చేయండి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu bank news
బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. బ్యాంకులు ఇప్పుడు కస్టమర్లకు అలర్ట్ చేస్తున్నాయి. పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని కోరుతున్నాయి. ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్స్ పంపుతూ కస్టమర్లను అలర్ట్ చేస్తున్నాయి. అందువల్ల మీరు ఇంకా పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే వెంటనే ఆ పని పూర్తి చేసుకోండి.
బ్యాంకులు మీకు పాన్ ఆధార్ లింక్‌కు సంబంధించిన మెసేజ్‌లు పంపితే.. వాటిని పట్టించుకోకుండా ఉండొద్దు. పాన్ ఆధార్ లింక్ చేసుకోండి. లేదంటే జరిమానా ఎదుర్కోవలసి రావొచ్చు. పాన్ ఆధార్ అనుసంధానం చేసుకోకపోతే రూ.1000 పెనాల్టీ పడుతుంది.

Also Read: undefined

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT పాన్ ఆధార్ లింక్ గడువు పొడిగిస్తూ గతంలోనే నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు కలిగిన వారికి జూన్ 30 వరకు గడువు ఉంది. ఈలోపు మీరు పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఇకపై డెడ్‌లైన్ పొడిగించకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌కు వెళ్లి పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చు. అలాగే పాన్ ఆధార్ లింక్ అయ్యిందా? లేదా? అని కూడా తెలుసుకోవచ్చు. పాన్ ఆధార్ లింక్ అనుసంధానానికి పెద్దగా సమయం కూడా పట్టద్దు. నిమిషాల్లోనే పని పూర్తవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.