మోదీ సర్కార్ ఈ-కామర్స్ కంపెనీలకు షాకిచ్చింది. లాక్ డౌన్ కొనసాగేంత వరకు నాన్ ఎసెన్షియల్ ప్రొడక్టులను విక్రయించవవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా కేవలం ఎసెన్షియల్ ప్రొడక్టులను (అత్యవసర ప్రొడక్టులు) విక్రయించాలని మరోసారి తెలిపింది. మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్లు మినహా ఇతర షాపులు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం తెలియజేసిన నేపథ్యంలో ఈకామర్స్ కంపెనీలకు సంబంధించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు నుంచి లాక్ డౌన్ ఆంక్షలను సడలించింది. నివాస సముదాయాలు, పరిసరాల్లోని దుకాణాలతో సహా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం రిజిస్టర్ అయిన షాపులు ఓపెన్ చేసుకోవచ్చని మోదీ సర్కార్ తెలిపింది. అయితే కరోనా వైరస్ హాట్స్పాట్లు, కంటైన్మెంట్ జోన్లకు సడలింపు వర్తించదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఏ ఏ షాపులు తెరుచుకోవచ్చనే అంశం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.
Also Read: undefined
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఈకామర్స్ సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఇప్పుడు ఈకామర్స్ కంపెనీలు కేవలం ఎసెన్షియల్ గూడ్స్ను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. ఫోన్లు, ల్యాప్టాప్స్, కూలర్లు, ఏసీలు వంటి వాటిని విక్రయించడానికి అవకాశం ఉండకపోవచ్చు.
కాగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దేశంలో కోవిడ్ 19 కేసులు ఇప్పటికే 25,000కు సమీపంలోకి చేరాయి. 750 మందికి పైగా మరణించారు. ఇక అంతర్జాతీయంగా కరోనా కేసులు 27 లక్షల పైకి చేరాయి. 1.95 లక్షల మంది మరణించారు.
Also Read: undefined
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఈకామర్స్ సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఇప్పుడు ఈకామర్స్ కంపెనీలు కేవలం ఎసెన్షియల్ గూడ్స్ను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. ఫోన్లు, ల్యాప్టాప్స్, కూలర్లు, ఏసీలు వంటి వాటిని విక్రయించడానికి అవకాశం ఉండకపోవచ్చు.
కాగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దేశంలో కోవిడ్ 19 కేసులు ఇప్పటికే 25,000కు సమీపంలోకి చేరాయి. 750 మందికి పైగా మరణించారు. ఇక అంతర్జాతీయంగా కరోనా కేసులు 27 లక్షల పైకి చేరాయి. 1.95 లక్షల మంది మరణించారు.