యాప్నగరం

PM Kisan Maan dhan Yojana: అదిరిపోయే స్కీమ్.. రైతులకు నెలనెలా రూ. 3 వేల పెన్షన్, అప్లయి చేసుకోవడమెలాగంటే?

PM Kisan Maan dhan Yojana: రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సాయపడుతుంది. వయసు మళ్లిన తర్వాత.. వీరు ఆర్థిక కష్టాలు పాలవ్వకుండా ముందే వారి కోసం పలు రకాల స్కీమ్‌లను నడుపుతోంది. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన కింద 60 ఏళ్ల దాటిన తర్వాత రైతులకు ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ ఇస్తుంది. అయితే ఈ పెన్షన్ ప్రయోజనాలు రైతులు పొందాలి..? ఈ స్కీమ్‌లో రైతులు ఎలా రిజిస్టర్ కావాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాం..

Authored byKoteru Sravani | Samayam Telugu 15 Sep 2022, 4:21 pm

ప్రధానాంశాలు:

  • రైతులను ఆర్థికంగా ఆదుకుంటోన్న ప్రభుత్వం
  • 60 ఏళ్లు దాటిన వారికి ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్
  • 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన రైతులు రిజిస్టర్ కావొచ్చు
  • దీనికోసం నెలకు కాస్త ప్రీమియం చెల్లిస్తే చాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu farmers pension Scheme
రైతుల పెన్షన్ స్కీమ్
రైతులకు ఆర్థికంగా సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను నిర్వహిస్తోంది. దీనిలో ఒకటే పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన(PM Kisan Maan dhan Yojana). ఈ స్కీమ్ నుంచి లక్షలాది మంది రైతులు ప్రయోజనం పొందవచ్చు. వయసు మళ్లిన తర్వాత రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద 60 ఏళ్లు దాటిన తర్వాత రైతులకు ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ అందివ్వాలనే ప్రొవిజన్ ఉంది. ఇది వయసు మళ్లిన తర్వాత రైతులకు ఆర్థికంగా సపోర్టు ఇవ్వనుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత రైతులు పంట పొలాలకు వెళ్లి పనిచేయడం చాలా కష్టం. వారికి ఆ సమయంలో ఇక పనిచేసే ఓపిక, బలం ఉండవు. కానీ ఆ సమయంలో వారిని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను నడుపుతోంది.
పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన గురించి..
ఈ స్కీమ్‌ను దేశంలోని చిన్న, సన్న కారు రైతులకు పెన్షన్ ఇవ్వడం ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా 60 ఏళ్లు దాటిన రైతులకు ప్రతి నెలా రూ.3 వేల చొప్పున సంవత్సరానికి ప్రభుత్వం రూ.36 వేలను అందిస్తుంది. ఈ స్కీమ్ నుంచి ప్రయోజనాలు పొందాలనుకుంటే.. రైతులు ఈ స్కీమ్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన రైతులు దీనిలో రిజిస్టర్ కావొచ్చు. రిజిస్ట్రేషన్ తర్వాత.. వారి వయసును బట్టి రైతులు ప్రతి నెలా కొంత మేర ప్రీమియాన్ని చెల్లించాలి. రైతుల వయసు బట్టి ఈ మొత్తాన్ని ఫిక్స్ చేస్తారు. దీనిలో రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు డిపాజిట్ చేయొచ్చు.

Also Read : మారుతీ కొత్త ఎస్‌యూవీ.. లాంచ్‌కి ముందే రికార్డులు సృష్టిస్తోంది!

ఎలా రిజిస్టర్ కావాలి..?
పీఎం కిసాన్ మాన్ ధన్ యోజనలో రిజిస్టర్ కావాలంటే.. మీరు దగ్గర్లోని సీఎస్‌సీ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. మీ భూమికి
సంబంధించిన అన్ని డాక్యుమెంట్లతో పాటు మీ వార్షిక ఆదాయ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాక కేంద్రం నుంచి డబ్బులు పొందడం కోసం బ్యాంకు అకౌంట్ వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఈ సమాచారమంతా ఇచ్చిన తర్వాత.. ఆధార్‌తో లింక్ చేసుకునే ఒక అప్లికేషన్ ఫామ్ మీరు పొందుతారు. ఆ తర్వాత ఈ ప్రాసెస్ పూర్తవుతుంది. మీకు పెన్షన్ నెంబర్, పెన్షన్ కార్డు వస్తుంది.

ఈ స్కీమ్‌లో చేరేందుకు మీరు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం మీరు maandhan.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. స్కీమ్ ఫామ్‌ను నింపి, అవసరమైన డాక్యుమెంట్ల గురించిన సమచారాన్ని అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫామ్ సబ్‌మిట్ అవుతుంది. ప్రాసెస్ పూర్తవుతుంది. ఈ స్కీమ్ గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు 1800267 6888 టోల్ నెంబర్‌కు కాల్ చేసి మరిన్ని వివరాలు పొందొచ్చు.

Also Read : ఎస్‌బీఐ కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.