కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్.. ఓట్ ఆన్ అకౌంట్ కన్నా ఎక్కువ స్థాయిలోనే ఉండొచ్చని సంకేతాలిచ్చారు. ఆర్థిక సవాళ్లు ఎదురైనప్పుడు మరీముఖ్యంగా వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించేందకు కేంద్ర ప్రభుత్వం సంప్రదాయ విధానాలకు భిన్నంగా వెళ్లొచ్చని తెలిపారు. గురువారం ఒక టీవీ చానల్ నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో జైటీ వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. ‘ఎన్నికల ఏడాది బడ్జెట్ అంటే అది మధ్యంతర బడ్జెట్ అనే సంప్రదాయం ఉంది. అయితే దేశ ప్రజలకు ఏం అవసరమో అదే బడ్జెట్లో ఉంటుంది’ అని అరుణ్ జైట్లీ తెలిపారు. వ్యవసాయ రంగం సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. ఆహార పదార్థాల ధరలు తగ్గాయని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగ సవాళ్లపై అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజాకర్షక విధానాలను కాకుండా హేతుబద్దమైన విధానాలను కలిగి ఉందనే అంశాన్ని మార్కెట్ వర్గాలు అర్థం చేసుకుంటాయన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ద్రవ్య లోటు లక్ష్యానికి కట్డుబడి ఉందని తెలిపారు. ద్రవ్య క్రమశిక్షణ వల్ల ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వాలు ద్రవ్య లోటు కట్టడి లక్ష్యాలను అధిగమించినప్పుడు తలెత్తిన పరిణామాలను గమనించామన్నారు.
బడ్జెట్ విషయానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సంప్రదాయాలకు భిన్నంగా వెళ్లడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే బడ్జెట్ను విలీనం చేసింది. అలాగే కేంద్ర బడ్జెట్లోనే జీఎస్టీని ప్రకటించింది. సాంప్రదాయబద్ధంగా చూస్తే మధ్యంతర బడ్జెట్లో పెద్ద ప్రకటనలేవీ ఉండవు. అయితే ఈసారి కేంద్రం రైతులకు నగదు బదిలీ పథకాన్ని ఆవిష్కరించొచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే మధ్యతరగతి ప్రజలపై పన్ను భారం తగ్గే చర్యలు తీసుకోవచ్చని తెలిపాయి.
కాగా ప్రస్తుతం అరుణ్ జైట్లీ కేన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లారు. ఆయన ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారా? లేదా? అనే అంశంపై స్పష్టత లేదు. ప్రభుత్వ అధికారులేమో బడ్జెట్ సమయానికల్లా జైట్లీ రావొచ్చని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగ సవాళ్లపై అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజాకర్షక విధానాలను కాకుండా హేతుబద్దమైన విధానాలను కలిగి ఉందనే అంశాన్ని మార్కెట్ వర్గాలు అర్థం చేసుకుంటాయన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ద్రవ్య లోటు లక్ష్యానికి కట్డుబడి ఉందని తెలిపారు. ద్రవ్య క్రమశిక్షణ వల్ల ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వాలు ద్రవ్య లోటు కట్టడి లక్ష్యాలను అధిగమించినప్పుడు తలెత్తిన పరిణామాలను గమనించామన్నారు.
బడ్జెట్ విషయానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సంప్రదాయాలకు భిన్నంగా వెళ్లడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే బడ్జెట్ను విలీనం చేసింది. అలాగే కేంద్ర బడ్జెట్లోనే జీఎస్టీని ప్రకటించింది. సాంప్రదాయబద్ధంగా చూస్తే మధ్యంతర బడ్జెట్లో పెద్ద ప్రకటనలేవీ ఉండవు. అయితే ఈసారి కేంద్రం రైతులకు నగదు బదిలీ పథకాన్ని ఆవిష్కరించొచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే మధ్యతరగతి ప్రజలపై పన్ను భారం తగ్గే చర్యలు తీసుకోవచ్చని తెలిపాయి.
కాగా ప్రస్తుతం అరుణ్ జైట్లీ కేన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లారు. ఆయన ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారా? లేదా? అనే అంశంపై స్పష్టత లేదు. ప్రభుత్వ అధికారులేమో బడ్జెట్ సమయానికల్లా జైట్లీ రావొచ్చని పేర్కొన్నారు.