యాప్నగరం

ఆర్డిక సంవత్సరం మార్పు 2019 తర్వాతే?

సుమారు 150 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి శుభం కార్డు వేస్తూ ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుంచి మార్చి 31కు బదులు జనవరి నుంచి డిసెంబరుకు మార్చాలనే ప్రయత్నాలను మోదీ సర్కారు ప్రస్తుతం దాదాపు విరుమించుకుంది.

TNN 29 Aug 2017, 1:13 pm
సుమారు 150 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి శుభం కార్డు వేస్తూ ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుంచి మార్చి 31కు బదులు జనవరి నుంచి డిసెంబరుకు మార్చాలనే ప్రయత్నాలను మోదీ సర్కారు ప్రస్తుతం దాదాపు విరుమించుకుంది. ప్రధాని మోదీ అభిప్రాయంతో అనేక రాష్ట్రాలు ఏకీభవించకపోవడం, మార్చడం వల్ల ఒనగూరే ప్రయోజనాలు ఏమీ ఉండవని భావించిన కేంద్రం దీన్ని పక్కనబెట్టినట్లు ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఆర్థిక సంవత్సరాన్ని మార్చడం వల్ల లాభం లేదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేయడంతో మోదీ కూడా ఈ ఆలోచనను విరమించుకున్నారని తెలియజేశారు. ఆంగ్లేయులు రుద్దివెళ్లిన సంప్రదాయాలను ఒక్కొక్కటిగా వదిలించుకోవాలన్నదే తన ఆలోచన అంటూ ప్రధాన మంత్రి గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.
Samayam Telugu financial year from april to march to stop from 2019
ఆర్డిక సంవత్సరం మార్పు 2019 తర్వాతే?


ఆర్థిక సంవత్సరం మార్పు చేయాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆమోదం పొందాలని, దీనికి కొన్ని సానుకూలంగా లేవు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత దీనిపై చర్చించాలని కేంద్రం భావిస్తున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలకు వెళ్లనున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని విమర్శలకు గురికావడం ఎందుకనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. కాగా, ఈ ఆలోచన వెనక్కు వెళ్లడంతో, ఇక సాధారణ బడ్జెట్ ఫిబ్రవరిలోనే పార్లమెంట్ ముందుకు రానున్నట్టు సమాచారం. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు మార్చింది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.