తమ కంపెనీలో 75% వాటాను వాల్ మార్ట్ సంస్థకు అమ్మేందుకు ఫ్లిప్ కార్ట్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అంగీకారం తెలిపింది. ఈ డీల్ విలువ 15 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని సంబంధిత వర్గాల నుంచి సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ తనకు ఫ్లిప్ కార్ట్ నందు ఉన్న 20 శాతం వాటాను వదులుకుంటుంది. ఈ వాటా విక్రయం చేతులు మారే సమయంలో గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ ... వాల్ మార్ట్ కొనుగోలు సమయంలో కొంత పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వచ్చే 10 రోజుల్లో విక్రయ ఒప్పందం పూర్తయ్యే వీలుంది.
దేశీయ కరెన్సీలో ఈ రెండింటి మధ్య కుదిరిన ఒప్పందం విలువ రూ.1 లక్ష కోట్ల పైమాటే ఉండొచ్చు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అమెజాన్.కామ్ భారత మార్కెట్లో దూసుకెళుతోంది. దీనికి గట్టి పోటీ ఇవ్వడానికి వాల్ మార్ట్ సంస్థ ఫ్లిప్ కార్ట్ను ఎంచుకుంది. ఫ్లిప్ కార్ట్ కంపెనీలో ఇది వరకూ సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్, టైగర్ గ్లోబల్, ఈ-బే, ఎస్సెల్ పార్ట్ నర్స్, నాస్పర్స్, టెన్ సెంట్ హోల్డింగ్స్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాయి.
దేశీయ ఈ-కామర్స్ రంగంలో మరింత గట్టి పోటీ ఏర్పడనుందా? వాల్మార్ట్ నుంచి పెద్దమొ త్తంలో పెట్టుబడులు రావడంతో ఫ్లిప్కార్ట్ అమెజా న్కు గట్టి పోటీ ఇవ్వవచ్చు. వాల్మార్ట్కు రిటైల్రం గంలో ఉన్న అనుభవం, లాజిస్టిక్స్, సరఫరా చెయిన్ ఫ్లిప్కార్ట్కు బాగా కలసివస్తుంది. ఈ కామర్స్ వర్గాల సమాచారం ప్రకారం ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఒప్పందం వాస్తవరూపం దాల్చిన తర్వాత రాబోయే రోజుల్లో భారత్ ఈ-కామర్స్ మార్కెట్లో ఫ్లిప్కార్ట్ – అమెజాన్లు మార్కెట్లో ఆధిప త్యం కోసం గట్టి పోరాటం చేస్తాయన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. కాగా వాల్మార్ట్ ఫ్లిప్కార్టు లో50 శాతం కంటే ఎక్కువ వాటా కొనుగోలు చేస్తే.. యాజమా న్యం హక్కులు వాల్మార్ట్కు దక్కుతాయి. అదే సమ యంలో వాల్మార్ట్ చేతికి అ తి పెద్ద మార్కెట్ దక్కిన ట్లు అవుతుంది.