Flybig Festival Sale Offer : విమాన ప్రయాణికులకు తీపికబురు. ఫ్లైట్ జర్నీ చేసే వారికి ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. కేవలం రూ. 999కే విమాన టికెట్ పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ ఆఫర్ వివరాలు తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం చాలా ఎయిర్లైన్స్ టికెట్ ధరలపై డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించాయి. ఏయిర్ ఏసియా, గో ఫస్ట్, విట్జెట్ వంటి సంస్థలు ఇప్పటికే రూ. 1499 ఆఫర్, రూ. 29 ఆఫర్ తీసుకువచ్చాయి. ఇప్పుడు వీటి స్థానంలో ఫ్లైబిగ్ అనే కంపెనీ కూడా చేరింది. ఈ రీజినల్ ఎయిర్లైన్స్ తాజాగా రూ. 999కే విమాన టికెట్ ఆఫర్ను అందుబాటులో ఉంచింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చ మురు ధరలు పైస్థాయిల్లో ఉండటం వల్ల ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో పాటుగా విమాన ఇంధనమైన ఏటీఎఫ్ రేట్లను కూడా పెంచేసింది. అయినా కూడా ఇప్పుడు ఎయిర్లైన్స్ టికెట్ ధరలపై తగ్గింపు ఆఫర్ ప్రకటించడం గమనార్హం. రూ. 999 ఆఫర్ ఏంటి?
ఫ్లైబిగ్ అనేది స్పెషల్ ఆఫర్ తీసుకువచ్చింది. దీని పేరు ఫ్లైబిగ్ ఫెస్టివల్ సేల్ ఆఫర్. ఈ ఆఫర్ కింద కంపెనీ రూ. 999కే విమాన టికెట్ అందిస్తోంది. ఎయిర్లైన్స్ ప్రకారం.. 10 వేల టికెట్లను రూ. 999 ప్రారంభ ధరతో పొందొచ్చు. జూలై 14 నుంచి ఆఫర్ ప్రారంభం అయ్యింది. జూలై 20 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. గువాహతి నుంచి పసిఘాట్, గువాహటి నుంచి రుప్సి రూట్లకు టికెట్ ధర రూ. 999 నుంచి ప్రారంభం అవుతోందని కంపెనీ తెలిపింది. గువాహటి నుంచి టెజు, హైదరాబాద్ నుంచి గోండియా రూట్లకు అయితే టికెట్ ధర రూ. 1500 నుంచి ప్రారంభం అవుతోంది. ఇండోర్ నుంచి గోండియా, హైదరాబాద్ నుంచి ఔరంగబాద్కు టికెట్ ధర రూ. 2 వేలను స్టార్ట్ అవుతోంది. ఆఫర్లో భాగంగా టికెట్ బుక్ చేసుకున్న వారు జూలై 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు. కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఇదివరకు ఏయిర్ఏసియా కూడా దాదాపు రూ.1500 రేటుతో టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ తీసుకువచ్చింది. ఢిల్లీ నుంచి జైపూర్ రూట్లకు ఈ ఆఫర్ను వర్తింపజేసింది. అలాగే గో ఫస్ట్ ఎయిర్లైన్స్ కూడా రూ. 1500 రేటుకే ఆఫర్ను తీసుకువచ్చింది. అయితే ఈ ఆఫర్లు జూలై 10 నాటికే ముగిశాయి. అలాగే విట్జెట్ ఎయిర్లైన్స్ ఏకంగా రూ. 26 విమాన టికెట్ ఆఫర్ను తీసుకువచ్చింది. ఈ ఆఫర్ కూడా జూలై 13తో ముగిసింది. ఇప్పుడు బిగ్ఫ్లై టికెట్ ధరల ఆఫర్ అందుబాటులో ఉంది.
Also Read: undefined
Also Read: undefined
ఫ్లైబిగ్ అనేది స్పెషల్ ఆఫర్ తీసుకువచ్చింది. దీని పేరు ఫ్లైబిగ్ ఫెస్టివల్ సేల్ ఆఫర్. ఈ ఆఫర్ కింద కంపెనీ రూ. 999కే విమాన టికెట్ అందిస్తోంది. ఎయిర్లైన్స్ ప్రకారం.. 10 వేల టికెట్లను రూ. 999 ప్రారంభ ధరతో పొందొచ్చు. జూలై 14 నుంచి ఆఫర్ ప్రారంభం అయ్యింది. జూలై 20 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. గువాహతి నుంచి పసిఘాట్, గువాహటి నుంచి రుప్సి రూట్లకు టికెట్ ధర రూ. 999 నుంచి ప్రారంభం అవుతోందని కంపెనీ తెలిపింది. గువాహటి నుంచి టెజు, హైదరాబాద్ నుంచి గోండియా రూట్లకు అయితే టికెట్ ధర రూ. 1500 నుంచి ప్రారంభం అవుతోంది. ఇండోర్ నుంచి గోండియా, హైదరాబాద్ నుంచి ఔరంగబాద్కు టికెట్ ధర రూ. 2 వేలను స్టార్ట్ అవుతోంది. ఆఫర్లో భాగంగా టికెట్ బుక్ చేసుకున్న వారు జూలై 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు. కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఇదివరకు ఏయిర్ఏసియా కూడా దాదాపు రూ.1500 రేటుతో టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ తీసుకువచ్చింది. ఢిల్లీ నుంచి జైపూర్ రూట్లకు ఈ ఆఫర్ను వర్తింపజేసింది. అలాగే గో ఫస్ట్ ఎయిర్లైన్స్ కూడా రూ. 1500 రేటుకే ఆఫర్ను తీసుకువచ్చింది. అయితే ఈ ఆఫర్లు జూలై 10 నాటికే ముగిశాయి. అలాగే విట్జెట్ ఎయిర్లైన్స్ ఏకంగా రూ. 26 విమాన టికెట్ ఆఫర్ను తీసుకువచ్చింది. ఈ ఆఫర్ కూడా జూలై 13తో ముగిసింది. ఇప్పుడు బిగ్ఫ్లై టికెట్ ధరల ఆఫర్ అందుబాటులో ఉంది.
Also Read: undefined
Also Read: undefined