Cyrus Mistry Died: టాటా సన్స్ మాజీ ఛైర్మన్, బిజినెస్ టైకూన్ సైరస్ మిస్త్రీ(54) కన్నుమూశారు. అహ్మదాబాద్ నుండి ముంబై వస్తుండగా ఆయన కారు డివైడర్ ను ఢీకొట్టింది. పాల్ఘర్లోని సూర్య నదిపై ఉన్న వంతెనపై మధ్యాహ్నం 3.15 గంటలకు ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో సైరస్ మిస్త్రీ అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. సైరస్ మిస్త్రీతో పాటు ముగ్గురు వ్యక్తులు ఆ కారులో ప్రయాణిస్తున్నారు. మిస్త్రీతో పాటు మరో వ్యక్తి కూడా మరణించినట్టు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు గాయాలు పాలైనట్టు తెలిసింది. వారిని వెంటనే గుజరాత్లోని ఓ ఆసుపత్రికి తరలించారు.
కాగా, 2012 నుంచి 2016 మధ్య కాలంలో సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్కి ఛైర్మన్గా ఉన్నారు. ఈ గ్రూప్కి ఆరో ఛైర్మన్ ఇతను. కానీ 2016 అక్టోబర్లో సైరస్ మిస్త్రీని టాటా గ్రూప్ అర్థాంతరంగా ఛైర్మన్ పదవి నుంచి తొలగించింది. ఈ విషయంలో సైరస్ మిస్త్రీ ఏళ్ల పాటు టాటా గ్రూప్తో పోరాడారు.
మహారాష్ట్రలోని బొంబైలో పార్శి కుటుంబానికి చెందిన వ్యక్తి మిస్త్రీ. కన్స్ట్రక్షన్ వ్యాపారి పల్లోంజి మిస్త్రీకి ఆయన చిన్న కొడుకు. వందేళ్లుగా పల్లోంజి కుటుంబం వ్యాపారాల్లో ఉంది. 1930లో తొలిసారి మిస్త్రీ తాత షాపూర్జీ పల్లోంజి టాటా సన్స్లో వాటాలను కొన్నారు. ఈ వాటాలు ప్రస్తుతం 18.5 శాతంగా ఉన్నాయి. 1991లో మిస్త్రీ తన కుటుంబానికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ షాపూర్జీ పల్లోంజి అండ్ కో లిమిటెడ్లో చేరడంతో ఆయన తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత ఈ కంపెనీకి ఎండీ అయ్యారు.
తన తండ్రి రిటైర్ కావడంతో.. సెప్టెంబర్ 1, 2006లో టాటా సన్స్ బోర్డులో చేరిన మిస్త్రీ.. ఆ తర్వాత 2012లో టాటా సన్స్కి ఛైర్మన్గా ఎంపికయ్యారు. టాటా ఇండస్ట్రీస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, టీసీఎస్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్, టాటా గ్లోబల్ బెవరేజస్, టాటా కెమికల్స్లను కలుపుకుని పలు దిగ్గజ టాటా కంపెనీలన్నింటికి కూడా ఈయననే ఛైర్మన్గా ఉన్నారు. కానీ నాలుగేళ్ల తర్వాత.. ఆయనను హఠాత్తుగా బయటకు పంపేసింది టాటా సన్స్.
Also read : Gold Rates: 6 వారాల కనిష్టంలో బంగారం ధర.. మరింత పతనమయ్యే ఛాన్స్!
కాగా, 2012 నుంచి 2016 మధ్య కాలంలో సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్కి ఛైర్మన్గా ఉన్నారు. ఈ గ్రూప్కి ఆరో ఛైర్మన్ ఇతను. కానీ 2016 అక్టోబర్లో సైరస్ మిస్త్రీని టాటా గ్రూప్ అర్థాంతరంగా ఛైర్మన్ పదవి నుంచి తొలగించింది. ఈ విషయంలో సైరస్ మిస్త్రీ ఏళ్ల పాటు టాటా గ్రూప్తో పోరాడారు.
మహారాష్ట్రలోని బొంబైలో పార్శి కుటుంబానికి చెందిన వ్యక్తి మిస్త్రీ. కన్స్ట్రక్షన్ వ్యాపారి పల్లోంజి మిస్త్రీకి ఆయన చిన్న కొడుకు. వందేళ్లుగా పల్లోంజి కుటుంబం వ్యాపారాల్లో ఉంది. 1930లో తొలిసారి మిస్త్రీ తాత షాపూర్జీ పల్లోంజి టాటా సన్స్లో వాటాలను కొన్నారు. ఈ వాటాలు ప్రస్తుతం 18.5 శాతంగా ఉన్నాయి. 1991లో మిస్త్రీ తన కుటుంబానికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ షాపూర్జీ పల్లోంజి అండ్ కో లిమిటెడ్లో చేరడంతో ఆయన తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత ఈ కంపెనీకి ఎండీ అయ్యారు.
తన తండ్రి రిటైర్ కావడంతో.. సెప్టెంబర్ 1, 2006లో టాటా సన్స్ బోర్డులో చేరిన మిస్త్రీ.. ఆ తర్వాత 2012లో టాటా సన్స్కి ఛైర్మన్గా ఎంపికయ్యారు. టాటా ఇండస్ట్రీస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, టీసీఎస్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్, టాటా గ్లోబల్ బెవరేజస్, టాటా కెమికల్స్లను కలుపుకుని పలు దిగ్గజ టాటా కంపెనీలన్నింటికి కూడా ఈయననే ఛైర్మన్గా ఉన్నారు. కానీ నాలుగేళ్ల తర్వాత.. ఆయనను హఠాత్తుగా బయటకు పంపేసింది టాటా సన్స్.
Also read : Gold Rates: 6 వారాల కనిష్టంలో బంగారం ధర.. మరింత పతనమయ్యే ఛాన్స్!