యాప్నగరం

సామాన్యులకు షాక్.. మరింత పెరగనున్న నిత్యావసరాల ధరలు

ఇప్పటికే టమాటాలతో పాటు పలు కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. సరుకు రవాణా ఛార్జీలు పెరుగుదల కారణంతోనే రానున్న కాలంలో నిత్యావసరాల ధరలు మరింత పెరగనున్నాయి.

Samayam Telugu 22 Jul 2020, 3:32 pm
కరోనా పుణ్యమా అని ఇప్పటికే అన్నింటి ధరలు మండిపోతున్నాయి. కాయగూరలు కొనాలన్న కూడా ధరలు పెరుగుదల చేసి జనం భయపడుతున్నారు. తాజాగా రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ ధరలు నిత్యావసరాల ధరలపై మరింత ప్రభావం చూపనున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ ధరలతో సరుకు రవాణా చేసే ట్రక్కులు ఇకపై సరుకు రవాణా ఛార్జీల్ని కూడా 20 శాతం పెంచనున్నారు. డీజిల్ అధిక ధరలే దీనికి కారణం. ఇదే జరిగితే, ఆ ప్రభావం ద్రవ్యోల్బణంపై స్పష్టంగా కనిపిస్తుంది. అంటే టమోటాల తరువాత, ఇతర కూరగాయలతో ధరలతో పాటు రోజువారీ వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ట్రక్ ఆపరేటర్ల యూనియన్ మాట్లాడుతూ ఇంధన ధర రోజూ పెరుగుతూ ఉంటే, ఛార్జీలను 20 శాతం పెంచాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. ప్రతి నెల లేదా త్రైమాసికంలో డీజిల్ ధరలను సమీక్షించాలని యూనియన్ డిమాండ్ చేసింది.
Samayam Telugu నిత్యావసరాల ధరల పెంపు
commodities


పండ్లు, కూరగాయలు, ఎఫ్‌ఎంసిజి వస్తువులు ఖరీదైనవి. సరుకు రవాణా ఛార్జీలు పెరిగితే పండ్లు, కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి. సమయంలో, ఎఫ్‌ఎంసిజి వస్తువుల ధరలు కూడా పెరగవచ్చు. డీజిల్ ధరల పెరుగుదల కారణంగా, సరుకు రవాణా పెరుగుదల మొత్తం దేశంపై ఒకేసారి కనిపిస్తుంది. ట్రక్ ఆపరేట్లు తీసుకోనున్న ఈనిర్ణయం ఎఫ్‌ఎంసిజి కంపెనీలపై సైతం ఒత్తిడిని పెంచుతుంది. దీంతో ఆ కంపెనీలు సైతం దిక్కులేని పరిస్థితులే ధరల్ని పెంచవలసి వస్తుంది.
Read More: అమెజాన్ భారీ ఆఫర్లు... రెండు రోజుల పాటు ప్రైమ్ డే సేల్స్
పండ్లు మరియు కూరగాయల ధరలలో రవాణా వాటా ఇతర వస్తువుల కంటే ఎక్కువ. వాస్తవానికి, వివిధ రైతులు తక్కువ పంటను కలిగి ఉంటారు. వారు తాము పండించిన పంటను అమ్మాలంటే తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. దీనికోసం వారు పెద్ద కంపెనీల కంటే ఎక్కువ ఖర్చు చేయాలి. పండ్ల విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. పండ్లను వివిధ రాష్ట్రాల నుండి ఢిల్లీకి తీసుకువస్తారు. అక్కడ్నుంచి వాటిని దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తారు. అటువంటి పరిస్థితిలో, సరుకు రవాణా పెరిగినప్పుడు పండ్ల ధరలు గణనీయంగా పెరుగుతాయి. కొన్నిరోజుల క్రితం టామాట ధర 10-15 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది కిలోకు 50 నుంచి 60 రూపాయలకు పెరిగింది. ఇతర ఆకుపచ్చ కూరగాయలు మరియు బంగాళాదుంపల ధరలు సైతం పెరిగిపోయాయి.

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌తో ఇప్పటికే సరుకు రవాణా రంగంతీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికీ కూడా సరుకు రవాణకు డిమాండ్ తక్కువగా ఉందన్నారు ఆల్ ఇండియా మోటార్స్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (ఎఐఎమ్‌టిసి) మాజీ చైర్మన్, కోర్ కమిటీ చైర్మన్ బాల్ మల్కిత్ సింగ్. 55 శాతవ వాహనాలు నిలిచిపోయాయన్నారు. ఇలాంటి సమయంలో తమ దగ్గర సరుకు రవాణా చార్జీలు 20 శాతం పెంచడానికి మించి వేరే మార్గం లేదన్నారాయన. ఇలాంటి పరిస్థితుల్లో ట్రక్కుల కార్యకలాపాలను కొనసాగించాలంటే, ఈ రోజు కాకపోతే, రేపు ఛార్జీలు ఖచ్చితంగా పెంచాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ ఖర్చును వినియోగదారులపై మోపడం తప్ప వేరే మార్గం లేదని ఆయన అన్నారు. వ్యాపారాన్ని కొనసాగించడానికి ప్రస్తుతం సరుకు రవాణాలో 20 శాతం పెరుగుదల అవసరమని సింగ్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.