యాప్నగరం

జీడీపీ అంచనాలను పెంచేశారన్న కథనాలపై కేంద్రం స్పందన

భారత వృద్ధి రేటును అతిగా అంచనా వేశారని అరవింద్ సుబ్రమణియన్ చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్రం స్పందించింది. జాతీయ ఆదాయ అంచనాల కోసం ఆమోదయోగ్యమైన విధానాలనే అనుసరించామని తెలిపింది.

Samayam Telugu 11 Jun 2019, 11:21 pm
భారత వృద్ధి రేటును అతిగా అంచనా వేశారని వస్తున్న వార్తల పట్ల కేంద్రం స్పందించింది. జాతీయ ఆదాయ అంచనాల కోసం ఆమోదయోగ్యమైన విధానాలనే అనుసరించామని స్పష్టం చేసింది. జీడీపీ విషయమై ప్రభుత్వ అంచనాలు.. పలు జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీల అంచనాలతో దాదాపు సమంగా ఉన్నాయని కేంద్ర గణాంక శాఖ తెలిపింది. 2011-12, 2016-17 మధ్య కాలంలో భారత జీడీపీని 2.5 శాతం అధికంగా చూపించారని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రభుత్వం ఇలా స్పందించింది.
Samayam Telugu gdp


భారత జీడీపీ 2011-12, 2016-17 మధ్య కాలంలో 4.5 శాతం మాత్రమేనని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రచురించిన పరిశోధన పత్రంలో అరవింద్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. దేశ జీడీపీ దాదాపు 7 శాతమని అధికారిక అంచనాలు పేర్కొంటున్నాయని, అది సరికాదని ఆయన చెప్పారు. వాస్తవ జీడీపీని లెక్కించడానికి ఉపయోగించే విధానాన్ని మార్చేయడం వల్లే ఇలా జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

గతంలో జీడీపీ అంచనాల కోసం 2004-05ను ప్రామాణికంగా తీసుకునేవారు కాగా.. ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చాక ఐరాస అనుసరించే సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ 2008కి అనుగుణంగా దాన్ని 2011-12కి మార్చారు. వాస్తవికతకు దగ్గరగా ఉండటం కోసం ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులకు అనుగుణంగా జీడీపీ బేస్ ఇయర్, ఐఐపీ ఇండెక్స్, సీపీఐలను కాలానుగుణంగా మారుస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.