యాప్నగరం

Stock Market Live: నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌‌మార్కెట్లు

గురువారం జీవనకాల గరిష్ఠస్థాయికి చేరి కొత్త రికార్డు చేసిన సూచీలు.. శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Samayam Telugu 10 Aug 2018, 11:36 am
గురువారం జీవనకాల గరిష్ఠస్థాయికి చేరి కొత్త రికార్డు నమోదు చేసిన సూచీలు.. శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటల సమయానికి సెన్సెక్స్ 124.61 పాయింట్ల నష్టంతో 37,899 వద్ద, నిఫ్టీ 34.15 పాయింట్ల నష్టంతో 11,438.4 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ ఉదయం 15 పైసల నష్టంలో 68.83 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం 3 పైసల లాభంతో 68.99 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. బులియన్ మార్కెట్లో 43 పాయింట్లు తగ్గి ప్రస్తుతం 29,625 వద్ద ట్రేడ్ అవుతోంది.
Samayam Telugu market 2


మరోవైపు.. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫలితాలు శుక్రవారం వెలువడాల్సి ఉండటంతో.. ఆ బ్యాంక్‌ షేర్లు కూడా ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్‌లో ఐటీ, మెటల్‌ షేర్లు కాస్త బలంగా ట్రేడవుతున్నాయి. దేశీయ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాదాపు 10 శాతం మేర నష్టాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం బీఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ధర 6.36శాతం పడిపోయి రూ. 282.50 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్‌ షేర్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.