యాప్నగరం

Go First బంపర్ ఆఫర్.. రూ.1,199 కే విమాన ప్రయాణం.. ఆఫర్ రెండు రోజులే!

Go First: విమానంలో ప్రయాణం చేయాలని భావించే వారికి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. వేల వేలు పెట్టి విమాన టికెట్ కొనుగోలు చేయలేక వెనకడుగు వేస్తూ వస్తున్న వారు ఇప్పుడు కేవలం రూ.1,199తోనే విమానం ఎక్కొచ్చు. గో ఫస్ట్ విమానయాన సంస్థ కస్టమర్లకు ఆకర్షించేందుకు ఈ ఆఫర్ తీసుకొచ్చింది. దేశీయ మార్గాలతో పాటు విదేశీయ ప్రయాణాలకు సైతం భారీగా డిస్కౌంట్లు ఇస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 23 Feb 2023, 7:19 pm

ప్రధానాంశాలు:

  • గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ సూపర్ ఆఫర్
  • బస్ టికెట్ ధరకే విమాన ప్రయాణం
  • దేశీయ మార్గాల్లో రూ.1199కే టికెట్
  • ఆఫర్ కొద్ది రోజులు మత్రమే.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Go First Airline
గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్
Go First: ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని భావిస్తున్నవారికి ఇది మంచి అవకాశం. కేవలం బస్ టికెట్ ధరకే విమానంలో ప్రయాణించే వీలు కల్పిస్తోంది లో కాస్ట్ ఎయిర్‌లైన్స్ సంస్థ గో ఫస్ట్ (Go First Airlines). ఈ ఏడాదికి గానూ టికెట్ ధర అత్యంత తక్కువ రూ.1,199కే అందిస్తోంది. ఫిబ్రవరి 23న రెండు రోజుల సేల్‌ను ప్రకటించింది గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ సంస్థ. రానున్న వేసవి ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని దేశీయ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ అందిస్తోంది. ఇటీవలే ఇండిగో సంస్థ సైతం ఇలాంటి ఆఫర్‌నే తీసుకొచ్చింది. బస్ టికెట్ ధరకే విమాన ప్రయాణం (Flight Ticket Fares) అందిస్తున్న ఆఫర్ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దేశీయ ప్రయాణాలకు కనిష్టంగా రూ.1,199కే టికెట్ అందిస్తోంది గో ఫస్ట్. అయితే, అంతర్జాతీయ విమానాలకు కనిష్టంగా రూ.6,139గా టికెట్ ధరను నిర్ణయించినట్లు తెలిపింది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, ప్రయాణాల సమయం మార్చి 12 నుంచి సెప్టెంబర్ 30, 2023 మధ్య చేసే వాటికే బుకింగ్స్ ఉంటాయని పేర్కొంది.

ఇండిగో ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్..
దేశీయ దిగ్గజ పౌర విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ (Indigo Airlines) బుధవారం కేవలం రూ.2,093కే విమాన టికెట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆ మరుసటి రోజునే గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ ఈ మేరకు కొత్త ఆఫర్ తీసుకు రావడం గమనార్హం. ఇండిగో సేల్ ఫిబ్రవరి 25 వ తేదీ వరకు కొనసాగనుంది. దీని ట్రావెల్ పీరియడ్ మార్చి 13 నుంచి అక్టోబర్ 13, 2023 వరకు ఉంటుంది.

భారీగా పెరిగిన విమాన ప్రయాణికులు..
కరోనా మహమ్మారి కారణంగా భారీగా దెబ్బతిన్న ఏవియేషన్ సెక్టార్ ప్రస్తుతం కోలుకుంటోంది. డొమెస్టిక్ ఎయిర్ ట్రాఫిక్ ఈ ఏడాది 2023, జనవరి లో 125.42 లక్షలకు చేరింది. ఏడాది క్రితం ఇదే సమయంతో పోలిస్తే రెండింతలు పెరగడం గమనార్హం. ఈ వివరాలను ఫిబ్రవరి 20న డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. అయితే, ఇది డిసెంబర్ 2022తో పోలిస్తే 1.5 శాతం తక్కువ మంది ప్రయాణాలు చేశారు. డిసెంబర్‌లో 127.35 లక్షల మంది ప్రయాణికులు విమాన ప్రయాణాలు చేశారు. అయితే, కోవిడ్ ముందు స్థాయికి ఇంకా చేరుకోలేదు. 2020 జనవరిలో డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ 127.83 లక్షల మంది ప్యాసింజర్లను గమ్యాలకు చేరవేశాయి.
రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.