యాప్నగరం

వద్దంటే వచ్చేస్తోన్న బంగారం

నోట్ల రద్దు తర్వాత బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. దీంతో పుత్తడి దిగుమతులు భారీగా పెరిగాయి. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం...

TNN 17 Sep 2017, 4:49 pm
నోట్ల రద్దు తర్వాత బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. దీంతో పుత్తడి దిగుమతులు భారీగా పెరిగాయి. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం... ఈ ఏడాది ఏప్రిల్‌-ఆగస్టు మధ్య కాలంలో బంగారం దిగుమతులు మూడింతలు పెరిగి 15.24 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. దీని వల్ల కరెంటు ఖాతా లోటు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు రూ.14.3 బిలియన్ డాలర్లు అంటే ఇది జీడీపీలో 2.4 శాతం. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- ఆగస్టు మధ్య పసిడి దిగుమతులు కేవలం 5.08 బిలియన్‌ డాలర్లు మాత్రమే.
Samayam Telugu gold imports jump three fold to usd 15 billion in april august
వద్దంటే వచ్చేస్తోన్న బంగారం


ఇక 2016 ఆగస్టులో కేవలం 1.11 బిలియన్‌ డాలర్లుగా ఉన్న దిగుమతులు ఈ ఏడాది 1.88 బిలియన్‌ డాలర్లకు చేరాయి. రాబోయే రోజుల్లో పండగ సీజన్‌ దృష్ట్యా దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా తర్వాత అత్యధికంగా బంగారం వినియోగించేది దేశం మనదే. దక్షిణ కొరియా నుంచి ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఆ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉన్నా, విలువైన లోహాల విషయంలో అంతర్గత పరిమితులు విధించింది. ప్రస్తుతం బంగారం దిగుమతులపై 10శాతం పన్ను విధిస్తున్నారు. ఆభరణాల తయారీదారులు, వాణిజ్య మంత్రిత్వశాఖ దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ఆర్థికమంత్రిత్వశాఖను కోరుతున్నాయి. ఆభరణాల తయారీ కోసమే మనవాళ్లు ఎక్కువగా బంగారాన్ని వినియోగిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.