యాప్నగరం

వరుసగా మూడో రోజు తగ్గిన పసిడి ధరలు

పండుగ సీజన్ ముగియడం, ఆభరణాల తయారీదార్ల నుంచి డిమాండ్ తగ్గడంతో వరుసగా పసిడి ధరలు మూడో రోజు పతనమయ్యాయి. గత రెండు రోజులతో పోల్చుకుంటే సోమవారం మరింత తగ్గింది.

TNN 23 Oct 2017, 5:36 pm
వరుసగా మూడో రోజు బంగారం ధర పతనమైంది. సోమవారం రూ.200 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,450కి చేరింది. పండుగ సీజన్‌ ముగియడం, అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంతో పసిడి ధర పడిపోయినట్లు బులియన్‌ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.50 పెరిగి రూ.40,900కు చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల కొనుగోళ్లు ఊపందుకోవడంతో వెండి ధర స్వల్పంగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 0.41శాతం తగ్గడంతో రెండు వారాల కనిష్ఠానికి చేరి 1,274.80డాలర్లు పలికింది.
Samayam Telugu gold price drops to two week low on dollar rally
వరుసగా మూడో రోజు తగ్గిన పసిడి ధరలు


మరోవైపు వరుసగా మూడు సెషన్ల నష్టాల అనంతరం దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. టెలికాం, ఎనర్జీ, స్థిరాస్తి, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఐటీ రంగాల షేర్ల మద్దతు లభించిన వేళ బీఎస్సీ సెన్సెక్స్ 116.76 పాయింట్లు లాభ‌ప‌డి 32,506 వద్ద ముగిసింది. నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 10,184 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 65.03గా ఉంది. మార్కెట్‌లో ఎయిర్‌టెల్‌, హీరో మోటోకార్పొ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌యూఎల్‌, సిప్లా, టీసీఎస్‌ షేర్లు లాభపడ్డాయి. ఉదయం స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 224 పాయింట్ల లాభంతో దూసుకెళ్లింది. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలు దేశీయ సూచీలకు కలిసొచ్చాయి. ఆయిల్‌, గ్యాస్‌, టెక్‌, లోహ, ఐటీ రంగాల షేర్లు లాభాల వానలో తడిశాయి. బ్లూచిప్‌ కంపెనీల త్రైమాసిక ఆదాయాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో మదుపరులు పెట్టుబడుల వైపు మొగ్గుచూపారని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.