యాప్నగరం

నెల రోజుల గరిష్టానికి చేరిన బంగారం ధర

గత కొద్ది కాలంగా పతనం అవుతున్న బంగారం ధరలు మంగళవారం భారీగా పెరిగాయి.

TNN 10 Jan 2017, 6:28 pm
బంగారం ధర భారీగా పెరిగి నెల రోజుల గరిష్టానికి చేరింది. ఇటీవల వరుసగా పతనమవుతూ వస్తున్న పసిడి ధరలు 11 నెలల కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. కానీ మంగళవారం ఒక్క రోజే పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 330 రూపాయలు పెరిగింది. దేశీయంగా ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతోపాటు అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటం కూడా దీనికి కారణమైంది. బ్రెగ్జిట్ నేపథ్యంలో పౌండు ధర కూడా ఇటీవల భారీగా పతనమైంది. దీంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించడం వల్లే ప్రజలు బంగారంపై పెట్టుబడి పెట్టారని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగనున్నాయనే భయాలు కూడా పసిడి ధర పెరగడానికి కారణమయ్యాయి.
Samayam Telugu gold price reaches one month high
నెల రోజుల గరిష్టానికి చేరిన బంగారం ధర


బంగారం ధర అంతర్జాతీయంగా 0.43శాతం పెరగడంతో ఔన్సు పసిడి ఖరీదు 1,185.90 డాలర్లకు చేరింది. డిసెంబర్‌ 5న రూ.29,050కు చేరిన బంగారం మళ్లీ మంగళవారం రూ.29,030కు చేరింది. వెండి ధర కూడా 0.5 శాతం పెరగ్గా.. ప్లాటినం ధర 0.4 శాతం పెరిగింది. వెండి ధర రూ.350 పెరిగి, కిలో రూ.40,750కు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండటంతో సిల్వర్ ధర పెరిగిందని విశ్లేషకులు తెలిపారు. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.