యాప్నగరం

32వేల‌ను దాటిన బంగారం ధ‌ర‌

ప‌సిడి ధ‌ర‌లు పైపైకే పోతున్నాయి. అక్షయ తృతీయ నేపథ్యంలో నగల వ్యాపారస్థుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధర మళ్లీ బాగా పెరిగింది.. పది గ్రాముల బంగారం ధర రూ.32వేల స్థాయిని దాటేసింది

Samayam Telugu 12 Apr 2018, 6:23 pm
ప‌సిడి ధ‌ర‌లు పైపైకే పోతున్నాయి. అక్షయ తృతీయ నేపథ్యంలో నగల వ్యాపారస్థుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధర మళ్లీ బాగా పెరిగింది.. పది గ్రాముల బంగారం ధర రూ.32వేల స్థాయిని దాటేసింది. బులియన్‌ ట్రేడింగ్‌లో పది గ్రాముల పసిడి ధర రూ.300 పెరిగి రూ.32,150కి చేరింది. అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరగడంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి భారీగా కూడా కొనుగోళ్లు పెరిగాయని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.
Samayam Telugu gold prices shoot up above rs 32000
32వేల‌ను దాటిన బంగారం ధ‌ర‌

వెండి ధర కూడా తిరిగి రూ.40వేల మార్కుకు చేరుకుంది. కిలో వెండి ధర రూ.240 పెరిగి రూ.40వేలకు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్‌ బాగా పెరిగింది. అంతర్జాతీయంగానూ పసిడి ధర పెరిగింది. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.02శాతం పెరిగి 132.80డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.60శాతం పెరిగి 16.65డాలర్లుగా ఉంది.

అక్షయ తృతీయ నేపథ్యంలో ప‌సిడి ప్రియం


అక్షయ తృతీయ నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు స్థానిక ఆభరణాల తయారీదారులు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. నెలవారీ పథకాలు, తరుగు తగ్గింపు, వివిధ మోడల్స్‌పై రాయితీ, ముందస్తు నగల రిజర్వేషన్‌ వంటి ఆఫర్లను అందిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.