Good News For Indian Railways Passengers! More Tatkal Tickets To Be Available, Thanks To This Big Step
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఇండియన్ రైల్వేస్.. ప్యాసింజర్లకు ఎంతో బెనిఫిట్!
మధ్యతరగతి ప్రజలు ఎక్కవగా రైల్వే ప్రయాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. వీరే కాదు చాలా మంది ట్రైన్ జర్నీ సుఖవంతంగా ఉంటుందని భావిస్తారు. అందుకే రైలులో ప్రయాణించడానికి మొగ్గు చూపుతారు. ట్రైన్ టికెట్ ముందే బుక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
Samayam Telugu19 Feb 2020, 11:21 am
మధ్యతరగతి ప్రజలు ఎక్కవగా రైల్వే ప్రయాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. వీరే కాదు చాలా మంది ట్రైన్ జర్నీ సుఖవంతంగా ఉంటుందని భావిస్తారు. అందుకే రైలులో ప్రయాణించడానికి మొగ్గు చూపుతారు. ట్రైన్ టికెట్ ముందే బుక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
తత్కాల్ ఆప్షన్
కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ట్రైన్ జర్నీ చేయాల్సి రావొచ్చు. ఇలాంటప్పుడు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలి. రైల్వే ప్రయాణానికి ఒక రోజు ముందు ఈ టికెట్ను బుక్ చేసుకోవలసి ఉంటుంది. సాధారణ టికెట్ బుకింగ్కు చెల్లించే డబ్బుతో పోలిస్తే తత్కాల్ టికెట్కు కొంత ఎక్కువ చార్జీ చెల్లించాలి.
తత్కాల్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే స్పీడ్గా టైమ్కు కరెక్ట్గా ఉండాలి. లేదంటే టికెట్ దొరకదు. తత్కాల్ టికెట్లు కేవలం కొన్ని నిమిషాల్లోనే అయిపోతాయి. అంత డిమాండ్ ఉంటుంది. నెమ్మదిగా ఉంటే మాత్రం తత్కాల్ టికెట్ బుకింగ్ లభించవు.
ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు ట్రైన్ ప్యాసింజర్లకు ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. చట్టవిరుద్దమైన సాఫ్ట్వేర్స్ను తొలిగించారు. అలాగే ఏకంగా 60 మంది ఏజెంట్లను అరెస్ట్ కూడా చేశారు. వీరందరూ తత్కాల్ టికెట్లు సామాన్య ప్రయాణికులకు అందుబాటులో లేకుండా సాఫ్ట్వేర్ ద్వారా బ్లాక్ చేసేవారు.
ఏజెంట్లను అదుపులోకి తీసుకోవడంతో ఇకపై తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలని భావించే వారికి మరిన్ని ఎక్కువ తత్కాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఇది వరకు కొన్ని నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉండే ఈ టికెట్లు ఇప్పుడు కొన్ని గంటల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండొచ్చు.
ఇండియన్ రైల్వేస్ అధికారుల ప్రకారం.. ఏఎన్ఎంఎస్ , ఎంఏసీ, జాగ్వార్ వంటి సాఫ్ట్వేర్లతో ఐఆర్సీటీసీ లాగిన్ క్యాప్చా, బుకింగ్ క్యాప్చా, బ్యాంక్ ఓటీపీ వంటి వివరాలతో ఏజెంట్లు తత్కాల్ టికెట్లను బ్లాక్ చేసేవారు. దీన్ని గమనించిన రైల్వేస్ ఇప్పుడు ఆ ఏజెంట్లను అరెస్ట్ చేసింది.
మనం ఎవరైనాసరే తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలని భావిస్తే.. సగటున 2.55 నిమిషాల టైమ్ పడుతుంది. కానీ ఈ ఏజెంట్లు సాఫ్ట్వేర్ సాయంతో కేవలం 1.48 నిమిషాల్లోనే తత్కాల్ టికెట్ను బుక్ చేసేవారు. దీంతో సాధారణ రైల్వే ప్రయాణికులకు ఎక్కువ తత్కాల్ టికెట్లు అందుబాటులో ఉండేవి కాదు.
తత్కాల్ టికెట్ బుకింగ్ ద్వారా ఏజెంట్లు సంవత్సరానికి ఏకంగా రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లు బిజినెస్ నిర్వమించే వారని ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఇకపై చట్టవిరుద్దమైన సాఫ్ట్వేర్ ద్వారా ఒక్క తత్కాల్ టికెట్ కూడా బుక్ చేయకుండా కఠిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఎవ్వరూ కూడా ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఉపయోగించవద్దని హెచ్చరించారు.
ఇండియన్ రైల్వేస్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే తత్కాల్ టికెట్ బుకింగ్ లభ్యత పెరిగింది. మగధ ఎక్స్ప్రెస్లో 2019 లక్టోబర్ 26న తత్కాల్ టికెట్లు 2 నిమిషాలు అందుబాటులో ఉండేవి. 2020 ఫిబ్రవరి 10న తత్కాల్ టికెట్ల 10 గంటలపాటు అందుబాటులో ఉన్నాయి. అలాగే సంపూర్ణ క్రాంతి ఎక్స్ప్రెస్లో కూడా తత్కాల్ టికెట్ లభ్యత 4 నిమిషాల నుంచి 18 నిమిషాలకు పెరిగింది.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.