బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్నీ కలిసి కొత్త కంపెనీని ఏర్పాటు చేయనున్నాయి. ఈ కంపెనీ ద్వారా కస్టమర్లకు ఇంటి వద్దకే బ్యాంకింగ్ సర్వీసులు అందించాలని ప్రయత్నిస్తున్నాయి. కోవిడ్ 19 నేపథ్యంలో బ్యాంకులు ఈమేరకు చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఎకనమిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. కంపెనీ పేరు పీఎస్బీ అలియన్స్గా ఉండొచ్చు. ఈ కంపెనీలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు భాగస్వామ్యం ఉంటుంది. ఈ కంపెనీ కస్టమర్లకు ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ సర్వీసులను అందిస్తుంది. అది కూడా ఇంటి వద్దకే ఈ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు.
Also Read: undefined
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI మాజీ చీఫ్ జనరల్ మేనేజరల్, రిలయన్స్ జియో పేమెంట్స్ బ్యాంక్ డిప్యూటీ సీఈవో రాజేందర్ మిరాఖూర్ ఈ కొత్త కంపెనీకి సీఈవోగా నియమితులైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పలు బ్యాంకులు వివిధ రకాల బ్యాంకింగ్ కరస్పాండెట్లతో డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల కోసం భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.
Also Read: undefined
అయితే కొత్త కంపెనీ వల్ల అన్ని పీఎస్బీలు వివిధ బ్యాంకింగ్ కరస్పాండెంట్లను కలిగి ఉండాల్సిన పని లేదు. ప్రస్తుతం చెక్ పికప్, అకౌంట్ స్టేట్మెంట్, టీడీఎస్ సర్టిఫికెట్, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, పే ఆర్డర్ల డెలివరీ వంటి 11 రకాల నాన్ ఫైనాన్షియల్ సర్వీసులు డోర్స్టెప్ బ్యాంకింగ్ ద్వారా పొందొచ్చు.
క్యాష్ విత్డ్రా సేవలు మాత్రమే ఫైనాన్షియల్ సర్వీసులు కింద ఇంటి వద్దనే లభిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్ కస్టమర్లు మొబైల్ యాప్, ఫోన్ కాల్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసుకొని డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. కాగా కొత్త కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఒక్కో భాగస్వామ్యం బ్యాంక్ ఒక్కో ఉద్యోగిని కొత్త కంపెనీలో నియమించనుంది.
Also Read: undefined
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI మాజీ చీఫ్ జనరల్ మేనేజరల్, రిలయన్స్ జియో పేమెంట్స్ బ్యాంక్ డిప్యూటీ సీఈవో రాజేందర్ మిరాఖూర్ ఈ కొత్త కంపెనీకి సీఈవోగా నియమితులైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పలు బ్యాంకులు వివిధ రకాల బ్యాంకింగ్ కరస్పాండెట్లతో డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల కోసం భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.
Also Read: undefined
అయితే కొత్త కంపెనీ వల్ల అన్ని పీఎస్బీలు వివిధ బ్యాంకింగ్ కరస్పాండెంట్లను కలిగి ఉండాల్సిన పని లేదు. ప్రస్తుతం చెక్ పికప్, అకౌంట్ స్టేట్మెంట్, టీడీఎస్ సర్టిఫికెట్, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, పే ఆర్డర్ల డెలివరీ వంటి 11 రకాల నాన్ ఫైనాన్షియల్ సర్వీసులు డోర్స్టెప్ బ్యాంకింగ్ ద్వారా పొందొచ్చు.
క్యాష్ విత్డ్రా సేవలు మాత్రమే ఫైనాన్షియల్ సర్వీసులు కింద ఇంటి వద్దనే లభిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్ కస్టమర్లు మొబైల్ యాప్, ఫోన్ కాల్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసుకొని డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. కాగా కొత్త కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఒక్కో భాగస్వామ్యం బ్యాంక్ ఒక్కో ఉద్యోగిని కొత్త కంపెనీలో నియమించనుంది.