యాప్నగరం

డెబిట్ కార్డు లావాదేవీలపై ఛార్జీల తగ్గింపు!

ఆర్థిక లావాదేవీల కోసం డెబిట్ కార్డు వాడుతున్నారా? మీకో గుడ్ న్యూస్. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తోన్న కేంద్రం.. డెబిట్ కార్డుల ద్వారా నగదు

TNN 8 Feb 2017, 9:35 am
ఆర్థిక లావాదేవీల కోసం డెబిట్ కార్డు వాడుతున్నారా? మీకో గుడ్ న్యూస్. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తోన్న కేంద్రం.. డెబిట్ కార్డుల ద్వారా నగదు లావాదేవీలపై ఛార్జీలను తగ్గించనుంది. కుదిరితే ఆ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయమై రిజర్వ్ బ్యాంకు ఇప్పటికే పని ప్రారంభించింది. రూ.1000 లోపు నగదు లావాదేవీలపై 0.25 శాతం, రూ.2 వేల లోపు 0.5 శాతం మార్జినల్ డిస్కౌంట్ ఛార్జీని ఆర్‌బీఐ వసూలు చేస్తోంది. జనవరి 1 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి రాగా.. మార్చి చివరి వరకూ ఈ ఛార్జీలు అమల్లో ఉండనున్నాయి. త్వరలోనే రూ. 2 వేల కంటే ఎక్కువ మొత్తంలో డెబిట్ కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై ఈ ఛార్జీలను తగ్గించే వీలుంది.
Samayam Telugu government confident that debit card charges may decline
డెబిట్ కార్డు లావాదేవీలపై ఛార్జీల తగ్గింపు!


డిజిటల్ లావాదేవీలు భారీగా పెరుగుతున్నందున ఛార్జీలు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచన ప్రాయంగా తెలిపారు. ఇప్పటికే పెట్రోలు బంకుల్లో డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులపై 0.75 శాతం డిస్కౌంట్ ఇస్తుండగా.. రైల్వే టికెట్ బుకింగ్‌ల విషయంలోనూ డెబిట్ కార్డుదారులకు కేంద్రం ప్రోత్సహాకాలను కల్పించిన సంగతి తెలిసిందే. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి.. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) మెషీన్లు, వేలిముద్ర రీడర్లు తదితర పరికరాలపై అన్ని సుంకాల (సీవీడీ, ఎస్‌ఏడీ) నుంచీ మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో జైట్లీ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.