యాప్నగరం

రూ.2,000 నోట్లు ముద్రించడం లేదు!?

కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్‌లో కొత్త రూ.2,000 నోట్లను చెలామణిలోకి తీసుకొచ్చింది.

Samayam Telugu 3 Jan 2019, 7:25 pm
రూ.2,000 నోట్ల ముద్రణ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. వ్యవస్థలో పెద్ద నోట్ల చెలామణిని క్రమంగా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని జాతీయ మీడియా పేర్కొంది. అక్రమ ఆస్తులకు, పన్ను ఎగవేతలకు, మనీ లాండరింగ్‌ వంటి వాటికి రూ.2,000 నోట్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారనే అనుమానంతో కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని తెలిపింది. అయితే రూ.2,000 నోట్ల ముద్రణ నిలిపివేత అంశంపై రిజర్వు బ్యాంకు స్పందించలేదు.
Samayam Telugu 2000


ప్రధాని మోదీ నల్లధనాన్నిఅరికట్టేందుకు 2016 నవంబర్‌లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త రూ.2,000 నోట్లను చెలామణిలోకి తీసుకొచ్చింది.

2018 మార్చి నాటికి వ్యవస్థలో చెలామణిలో ఉన్న కరెన్సీ విలువ రూ.18.03 లక్షల కోట్లు. ఇందులో 37 శాతం (రూ.6.73 లక్షల కోట్లు) రూ.2,000 నోట్లు ఉండగా, 43 శాతం (రూ.7.73 లక్షల కోట్లు) రూ.500 నోట్లు ఉన్నాయి. మిగతా మొత్తం ఇతర నోట్ల రూపంలో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.