యాప్నగరం

జీఎస్టీ రిటర్న్‌ల దాఖలుకు గడువు పొడిగింపు!

ఏప్రిల్ నెలకు సంబంధించిన జీఎస్టీ రిటర్న్‌ల దాఖలుకు గడువును కేంద్రం మరో రెండురోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవ గడువు మే 20తోనే ముగియనుండగా... 22 వరకు దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది.

TNN 19 May 2018, 1:19 pm
ఏప్రిల్ నెలకు సంబంధించిన జీఎస్టీ రిటర్న్‌ల దాఖలుకు గడువును కేంద్రం మరో రెండురోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవ గడువు మే 20తోనే ముగియనుండగా... 22 వరకు దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది. రిటర్న్‌ల దాఖలు సమయంలో పన్ను చెల్లింపుదారులకు కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదార్లకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి అత్యవసర నిర్వహణ చర్యలు చేపట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.
Samayam Telugu gst.


వాస్తవానికి ఆ నెలకు సంబంధించి రిటర్న్‌లను మరుసటి నెల 20వ తేదీ వరకు సమర్పించాల్సి ఉంటుంది. ఇదేవిధంగా ఏప్రిల్‌ రిటర్న్‌లను మే 20 వరకు దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే సాంకేతిక కారణాల నేపథ్యంలో మే 22 వరకు పొడిగించారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన జీఎస్టీ ఆదాయ వివరాలను జూన్‌లో వెల్లడించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.