యాప్నగరం

Jute MSP: రైతులకు శుభవార్త.. పంట మద్దతు ధర పెంచిన కేంద్రం.. క్వింటాల్‌పై ఎంత పెరిగిందంటే?

Jute MSP: కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి శుక్రవారం రోజు కీలక ప్రకటన చేసింది. ఒక పంట కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇక దీనివల్ల అన్నదాతలకు పెద్ద ఊరట కలుగుతుందని చెప్పొచ్చు. ఏకంగా 40 లక్షల మంది రైతులకు ప్రయోజనం ఉంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ చెప్పారు.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 25 Mar 2023, 2:38 pm
Jute MSP: ముడి జనపనార (Raw Jute) పంట కనీస మద్దతు ధరను (MSP) పెంచుతున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. క్వింటాల్‌పై రూ. 300 పెరగ్గా.. 2023-24 సీజన్‌కు సంబంధించి ఈ పంట మద్దతు ధర రూ.5050కి పెరిగినట్లు వెల్లడించింది. అంతకుముందు ముడి జనపనార మద్దతు ధర రూ.4750గా ఉండేది. ఇక ఈ నిర్ణయంతో రైతులకు పంట పెట్టుబడిపై 63 శాతం మేర లబ్ది చేకూరి, 40 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం శుక్రవారం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ముడి జనపనార పంట పండించే రైతులు సంతోషంలో ఉన్నారు. మద్దతు ధర పెంచిన నేపథ్యంలో.. ఇతర పంటలు వేసే వారు కూడా దీనిపై ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంటుంది.
Samayam Telugu Jute MSP


శుక్రవారం రోజు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. ఇక వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ సూచనలు, సిఫార్సుల మేరకు ఈ రా జూట్ మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించినట్లు చెప్పారు అనురాగ్ ఠాకుర్. ఇక ఈ నిర్ణయం వల్ల పంట ఉత్పత్తి వ్యయం కంటే 63 శాతం ఎక్కువగా రిటర్న్స్ పొందొచ్చని అన్నారు.

ఇదే విధంగా జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (JCI) .. ధర మద్దతు కార్యకలాపాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి నోడల్ ఏజెన్సీగా కొనసాగుతుంది. ఇలాంటి సందర్భాల్లో రైతులకు ఏదైనా నష్టం సంభవిస్తే.. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రీఎంబర్స్ చేస్తుంది.

ఫేస్‌బుక్ సీఈఓ Mark Zuckerberg ఇంట సంబరాలు.. పండంటి ఆడబిడ్డ.. మూడోసారి తండ్రిగా.. Gooty Pendekallu: AP ప్రజలకు గుడ్‌న్యూస్.. గుత్తి -పెండేకల్లు Railway Line డబ్లింగ్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

ఇక శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో మరో రెండు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ (కరవు భత్యం), డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది తాజాగా 4 శాతం పెంచగా మొత్తం 42 శాతానికి పెరిగింది. ఇది జనవరి నుంచే అమలు చేయనున్నారు. అంటే.. జనవరి, ఫిబ్రవరికి సంబంధించిన బకాయిలు కూడా అందనున్నాయి. సుమారు కోటి మందికిపైగా దీని వల్ల ప్రయోజనం దక్కనుంది. ఏటా రెండు సార్లు డీఏ, డీఆర్‌కు సంబంధించి కేంద్రం సవరణలు చేస్తుంటుంది.

మరోవైపు.. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీని మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఏటా మొత్తం 12 సిలిండర్ల వరకు ఒక్కో సిలిండర్‌పై రూ.200 రాయితీ ఇస్తామని ప్రకటించింది.

Government Employees: ప్రభుత్వ ఉద్యోగులకు Modi సర్కార్ శుభవార్త.. DA భారీగా పెంపు.. కోటి మందికిపైగా ప్రయోజనం! DA Hike: 4 శాతం పెరిగిన DA.. రూ. 23 వేల జీతం ఉంటే వారికి ఇప్పుడు ఎంత పెరుగుతుంది.. పూర్తి లెక్కలు ఇక్కడ చూడండి..

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.