యాప్నగరం

PPF-SSY: కేంద్రం మరో గుడ్‌న్యూస్.. ఈ పథకాల వడ్డీ రేట్లు పెంపు.. లక్షల మందికి ప్రయోజనం!

PPF-SSY: కేంద్ర ప్రభుత్వం మార్చి నెలాఖరులో మరో గుడ్‌న్యూస్ అందించేందుకు సిద్ధమవుతోంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలైన పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి వాటి వడ్డీ రేట్లను పెంచే అవకాశం కనిపిస్తోంది. మార్చి చివర్లో దీనికి సంబంధించి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. పీపీఎఫ్, ఎస్ఎస్‌వై వంటి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో ఏ పథకంపై ఎంత వడ్డీ పెరిగే అవకాశం ఉంది, గతంలో ఎంత పెంటారు అనే విషయాలను ఓసారి పరిశీలిద్దాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 26 Mar 2023, 12:14 pm
PPF-SSY: దేశంలోని సగటు వేతన జీవులు, సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. మార్చి నెలాఖరులో మరో గుడ్‌న్యూస్ అందించనుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలు (Small Savings Scheme)ల వడ్డీ రేట్లను పెంచే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య త్రైమాసికానికి సంబంధించి కొత్త వడ్డీ రేట్లను సవరించనుంది కేంద్రం. జనవరి-మార్చి క్వార్టర్‌కు సంబంధించి గతంలో కొన్ని స్మాల్ సేవింగ్స్ పథకాలపై వడ్డీ రేట్లను పెంచింది కేంద్ం. అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన పథకాల జోలికి వెళ్లలేదు. దీంతో ఈసారి వడ్డీ రేట్ల పెంపు తప్పనిసరిగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం వర్గాలు భావిస్తున్నాయి.
Samayam Telugu SSY
ఎస్ఎస్‌వై


చిన్న మొత్తాల పొదుపు స్కీమ్‌పై ప్రతి మూడు నెలలు ఓసారి వడ్డీ రేట్లను సవరిస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. సెకండరీ మార్కెట్లో ప్రభుత్వం సెక్యూరిటీలపై వచ్చే రాబడి ఆధారంగా ఈ వడ్డీ రేట్లను సవరిస్తుంటుంది. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌కు సంబంధించి గత చివరి మూడు నెలలకు చెందిన సెక్యూరిటీల రాబడులను పరిశీలిస్తుంది. 2011లో శ్యామలా గోపీనాథ్ కమిటీ సూచనల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ 2016లో ఓ ఫార్ములాను నోటిఫై చేసింది. దీని ద్వారా బాండ్లపై వచ్చే రాబడికి 25 బేసిస్ పాయింట్ల మేర పీపీఎఫ్‌కు (PPF Interest Rates) వడ్డీగా చెల్లించాలి. మరోవైపు.. సుకన్య సమృద్ధి యోజనకైతే (sukanya samriddhi yojana interest rate) 75 బేసిస్ పాయింట్లు కలుతున్నారు. దీంతో పాటు సీనియర్ సిటిజన్ స్కీమ్‌కు గరిష్టంగా 100 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీగా చెల్లిస్తున్నారు. డిసెంబర్-ఫిబ్రవరి త్రైమాసికంలో బెంచ్ మార్క్ అయిన 10 ఏళ్ల సెక్యూరిటీ బాండ్లపై 7.37 శాతం రాబడి వస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై (Public Provident Fund) ప్రస్తుతం కేంద్ర సర్కార్ 7.1 శాతం వడ్డీ ఇస్తోంది. ఆర్థిక శాఖ ఫార్ములా ప్రకారం ఈ మొత్తం 7.6 శాతానికి పెరగాల్సి ఉంది. సుకన్య సమృద్ధి యోజనకు ప్రస్తుతం 7.6శాతం వడ్డీ ఇస్తుండగా అది 8.1 శాతానికి చేరే అవకాశం ఉంది. గత జనవరి-మార్చి త్రైమాసికంలో కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలపై 20 నుంచి 110 బేసిస్ పాయింట్లు పెంచిన కేంద్రం పీపీఎఫ్, ఎస్ఎస్‌వై పథకాలకు ఎలాంటి మార్పులు చేయలేదు. ఈసారైనా పెంచుతారో లేదో వేచి చూడాల్సిందే.

రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.