యాప్నగరం

Toll Plazas: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక టోల్ గేట్లు ఉండవు.. 6 నెలల్లో జీపీఎస్ విధానం!

Toll Plazas: వాహనదారుల తిప్పలను తప్పించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలను తొలగించేందుకు సిద్ధమైంది. అయితే, వాటి స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ ఫీజు విధానాన్ని 6 నెలల్లో అమలులోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దీని వల్ల సమయం ఆదా అవడంతో పాటు రహదారిపై ప్రయాణించిన దూరానికే టోల్ ఛార్జీలు వసూలు చేసే వెసులుబాటు అందుబాటులో ఉంటుందన్నారు.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 24 Mar 2023, 7:56 pm
Samayam Telugu Toll plaza
టోల్ ప్లాజా
Toll Plazas: నేషనల్ హైవేలపై ప్రయాణిస్తున్నప్పుడు వాహనదారులు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కోసారి టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. దాని నుంచి తప్పించేందుకు ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది కేంద్రం. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు గుడ్‌న్యూస్ అందించింది. జాతీయ రహదారులపై టోల్ ఫీజు (GPS Based Toll System) వసూలుకు జీపీఎస్ ఆధారిత వ్యవస్థను వచ్చే ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ఉపరితల రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల స్థానంలోనే వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీని వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం సహా ప్రయాణించిన దూరానికే టోల్ ఫీజు వసూలు చేసే వెసులుబాటు ఉంటుందని తెలిపారు.

ప్రస్తుతం టోల్ ఛార్జీల (Toll Charges) ద్వారా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రతి ఏటా రూ.40 వేల కోట్లు ఆదాయం అందుకుంటోంది. ఇది మరో రెండుమూడేళ్లలో రూ.1.40 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు నితిన్ గడ్కరీ. వాహనాన్ని ఎక్కడా ఆపకుండానే నంబర్ ప్లేట్ ఆధారంగా ఛార్జీలు (gps toll collection india) వసూలు చేసే విధానంపై ప్రస్తుతం రవాణా శాఖ పని చేస్తోందన్నారు. 2018-19 సమయంలో టోల్ గేట్ల వద్ద ఒక్కో వాహనం సగటున 8 నిమిషాల పాటు ఆగాల్సి వచ్చేదని, ఫాస్టాగ్ (Fastag) విధానం అమలులోకి వచ్చాక ఆ సమయం 47 సెకన్లకు తగ్గిపోయిందని గుర్తు చేశారు మంత్రి. ఈ కొత్త జీపీఎస్ విధానం అమలులోకి వస్తే ఆ సమయం కూడా ఆగాల్సిన పని లేదన్నారు.

ఇటీవల జమ్ముకశ్మీర్‌లో గుర్తించిన లిథియం నిల్వలను సమర్థవంతగా వినియోగించుకుంటే భారత్ ఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలోనే తొలి స్థానానికి చేరుకుంటుందన్నారు గడ్కరీ. ప్రస్తుతం ఏటా 1200 టన్నుల లిథియంను దిగుమతి చేసుకుంటున్నామన్నారు. 2022లోనే జపాన్‌ను దాటి మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా భారత్ అవతరించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం లభించిన లిథియం నిల్వలను సమర్థంగా వినియోగిస్తే అగ్రరాజ్యం అమెరికా, చైనాలను సైతం దాటి అగ్రస్థానంలో నిలుస్తామన్నారు. భవిష్యత్తులో విద్యుత్ బస్సులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా రవాణాను ప్రోత్సహించడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు కేంద్ర మంత్రి.

Also Read: New Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. మీ జేబుకు చిల్లు పడొచ్చు.. ఏ మార్పులు రాబోతున్నాయంటే?

రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.