ఉద్యోగులకు సుప్రీం కోర్టు షాక్.. కీలక తీర్పు!
సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ఝలక్ ఇచ్చే తీర్పును వెలువరించింది. ఉద్యోగి కంపెనీకి ఏమైనా బకాయిలు చెల్లించాల్సి ఉంటే.. అప్పుడు గ్రాట్యూటీ డబ్బులు నిలుపుదల చేయొచ్చని తెలియజేసింది.
Samayam Telugu 29 Dec 2020, 1:30 pm
ప్రధానాంశాలు:
- సుప్రీం కీలక తీర్పు
- ఉద్యోగులకు ఝలక్
- గ్రాట్యుటీపై కీలక నిర్ణయం
దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. కీలక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడనుంది. సుప్రీం కోర్టు గ్రాట్యుటీకి సంబంధించి కీలక తీర్పును వెలువరించింది. దీని వల్ల ఉద్యోగులపై ఎఫెక్ట్ పడుతుంది. ఉద్యోగులకు సంబంధించిన గ్రాట్యుటీ మొత్తాన్ని ఇవ్వకుండా నిలుపుదల చేయొచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఉద్యోగి కంపెనీకి బకాయిలు ఉన్నట్లయితే అప్పుడు కంపెనీ ఆ ఉద్యోగి గ్రాట్యుటీని ఇవ్వకుండా నిలుపుదల చేయవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది.
Also Read: undefined
సంజయ్ కే కౌల్ సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఒక ఉద్యోగి కంపెనీ క్వార్టర్ను నిర్దేశిత కాలం తర్వాత కూడా అలాగే ఉపయోగిస్తూ ఉంటే అప్పుడు కంపెనీ ఈ రెంట్ డబ్బులను గ్రాట్యుటీ మొత్తంలో నుంచి కట్ చేసుకోవచ్చు.
ఉదాహరణకు ఉద్యోగి క్వార్టర్స్లో ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత ఆ క్వార్టర్ను ఖాళీ చేయాల్సి ఉంది. అయితే ఇతను క్వార్టర్స్ను ఖాళీ చేయలేదు. ఇలాంటి సమయంలో ఉద్యోగి కంపెనీకి రెంట్ చెల్లించాలి. ఇంకా పెనాల్టీ కూడా పడుతుంది. ఒకవేళ ఉద్యోగి ఈ డబ్బులు కట్టకపోతే.. అప్పుడు ఈ డబ్బును కంపెనీ ఉద్యోగి గ్రాట్యుటి నుంచి కట్ చేసుకోవచ్చు.
Also Read: undefined
సంజయ్ కే కౌల్ సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఒక ఉద్యోగి కంపెనీ క్వార్టర్ను నిర్దేశిత కాలం తర్వాత కూడా అలాగే ఉపయోగిస్తూ ఉంటే అప్పుడు కంపెనీ ఈ రెంట్ డబ్బులను గ్రాట్యుటీ మొత్తంలో నుంచి కట్ చేసుకోవచ్చు.
ఉదాహరణకు ఉద్యోగి క్వార్టర్స్లో ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత ఆ క్వార్టర్ను ఖాళీ చేయాల్సి ఉంది. అయితే ఇతను క్వార్టర్స్ను ఖాళీ చేయలేదు. ఇలాంటి సమయంలో ఉద్యోగి కంపెనీకి రెంట్ చెల్లించాలి. ఇంకా పెనాల్టీ కూడా పడుతుంది. ఒకవేళ ఉద్యోగి ఈ డబ్బులు కట్టకపోతే.. అప్పుడు ఈ డబ్బును కంపెనీ ఉద్యోగి గ్రాట్యుటి నుంచి కట్ చేసుకోవచ్చు.