యాప్నగరం

High paid Job: ఉద్యోగులకు కనీస వేతనం రూ.64 లక్షలు.. ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకునే అవకాశం!

High paid Job: ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉండటంతో... చాలా కంపెనీలు ఈ మధ్యన వేతనాలు పెంచుతున్నాయి. చాలా కంపెనీలు పనికి తగ్గ జీతం ఇవ్వన్నప్పటికీ.. కొన్ని కంపెనీలు మంచి పేమెంట్‌నే ఆఫర్ చేస్తున్నాయి. అమెరికాలో ఒక కంపెనీ అయితే ఏకంగా కనీస వేతనంగా రూ.64 లక్షలను ఆఫర్ చేస్తుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో డాన్ ప్రిన్స్ తెలిపారు. డాన్ ప్రిన్స్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆయన ట్వీట్‌పై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Authored byKoteru Sravani | Samayam Telugu 11 Aug 2022, 4:30 pm

ప్రధానాంశాలు:

  • గ్రావిటీ పేమెంట్స్ కంపెనీలో ఉద్యోగులకు భారీ వేతనం
  • ఉద్యోగులకు కనీస వేతనంగా రూ.64 లక్షలు
  • భారీ వేతనంతో పాటు ఎక్కడి నుంచైనా పనిచేసుకునే అవకాశం
  • ఒక్కో ఉద్యోగానికి 300కి పైగా అప్లికేషన్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Gravity Payments CEO Dan Price
గ్రావిటీ పేమెంట్స్ సీఈవో డాన్ ప్రిన్స్
High paid Job: పని ఎక్కువ.. జీతం తక్కువ.. ఈ మాట చాలా మంది నోళ్లలో మీరు వినుంటారు. అవును చాలా కంపెనీలు ఉద్యోగులతో బాగా వర్క్ చేయించుకుని, దానికి తగ్గ జీతం ఇవ్వడంలో మాత్రం విఫలమవుతూ ఉంటాయి. కొన్ని కంపెనీలలో ఉద్యోగులకు ఉండే పని ఒత్తిడి అంతాఇంతా కాదు. ప్రయోజనాలు కూడా తక్కువే. కానీ కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగులను రారాజులా చూసుకుంటున్నాయి. అలాంటి ఒక కంపెనీనే క్రెడిట్ కార్డు ప్రాసెసింగ్ కంపెనీ గ్రావిటీ పేమెంట్స్. ఈ కంపెనీ తన ఉద్యోగులకు కనీస వేతనంగా 80 వేల డాలర్లను అంటే రూ.64 లక్షలను ఆఫర్ చేస్తుంది. భారీగా కనీస వేతనాన్ని ఆఫర్ చేయడం మాత్రమే కాకుండా.. తమ ఉద్యోగులు ఎక్కడి నుంచి కావాలనుకుంటే అక్కడి నుంచి పనిచేసుకోవచ్చని చెబుతోంది.
భారీ వేతనంతో పాటు పలు రకాల ప్రయోజనాలను కూడా ఈ కంపెనీలో ఉద్యోగులు పొందవచ్చు. పెయిడ్ పేరెంటల్ లీవ్, ఇన్సూరెన్స్ వంటి పలు ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంది. తమ కంపెనీ కనీసం వేతనంగా 80 వేల డాలర్లతో పాటు, ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకునే సౌకర్యాన్ని, పెయిడ్ పేరెంటల్ లీవ్‌ను ఆఫర్ చేస్తుందని ఆ కంపెనీ సీఈవో డాన్ ప్రిన్స్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా తెలిపారు. తమ కంపెనీలో ఒక్కో ఉద్యోగానికి 300కి పైగా అప్లికేషన్లు వస్తున్నట్టు కూడా చెప్పారు.

Also Read :పిజ్జాను రిజక్ట్ చేసిన ప్రజలు.. చివరికి దుకాణం సర్దేసిన డోమినోస్

నరకలాంటి కంపెనీలో ఎవరూ పనిచేయకూడదని, కంపెనీలు న్యాయపరమైన చెల్లింపులు చేయమని నిరాకరించకూడదని డాన్ ప్రిన్స్ తెలిపారు. అంతేకాక ఉద్యోగులను ఎంతో గౌరవంతో చూడాలని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో.. వేతనాలను కూడా పెంచారు. డాన్ ప్రిన్స్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం ట్విటర్‌లో వైరల్‌గా మారింది. ఎంతో మంది ట్విటర్ మనసులను ఆయన ఆకట్టుకున్నారు. ఉద్యోగుల సమయాన్ని, ప్రయత్నాన్ని గౌరవించాలని కోరుతూ సీఈవో ముందుకు రావడం నిజంగా అభినించదగ్గ విషయం.

‘1980లో రెస్టారెంట్లో పనిచేసినందుకు ఒక గంటకి 9 నుంచి 11 డాలర్లు ఇచ్చేవారు. ఆ డబ్బులతో నేను సీటెల్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో నివసించే వాడిని. కానీ ప్రస్తుతం గంటకు కనీసం 13 నుంచి 15 డాలర్లు ఇస్తున్నప్పటికీ.. రెంట్‌కి కూడా సరిపోవడం లేదు’ అని ఒక యూజర్ చెప్పాడు. అలాగే మీ కంపెనీ అంత వేతనాన్ని చెల్లించగలుగుతుందేమో కానీ.. చాలా కంపెనీలు అంత వేతనాలు చెల్లించలేవు అంటూ మరో యూజర్ అన్నాడు. ఇలా పలు యూజర్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Also Read : ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త.. మరో రెండేళ్ల పాటు ఈ స్కీమ్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.