యాప్నగరం

మే నెల జీఎస్టీ వసూళ్లు.. ఎంతో తెలుసా?

ఏప్రిల్ 30 నాటికి 60.47గా ఉన్న రిటర్నుల సంఖ్య, మే 31 నాటికి 62.46కి పెరిగినట్లు ఆయన తెలిపారు. 2017-2018 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు జీఎస్‌టీ వసూళ్లు రూ. 89,885కోట్లుగా నమోదయ్యాయి.

Samayam Telugu 1 Jun 2018, 9:10 pm
గతనెలతో పోలిస్తే.. ఈ నెలలో జీఎస్టీ వసూళ్లు జీఎస్టీ వసూళ్లు తగ్గాయని ఆర్థికశాఖ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా తెలిపారు. ఏప్రిల్ నెలలో జీఎస్టీ కింద రూ. 1.03లక్షల కోట్ల వసూళ్లు రాగా, మే నెలలో స్వల్పంగా తగ్గి రూ. 94,016 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. ఏప్రిల్ 30 నాటికి 60.47గా ఉన్న రిటర్నుల సంఖ్య, మే 31 నాటికి 62.46కి పెరిగినట్లు ఆయన తెలిపారు. 2017-2018 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు జీఎస్‌టీ వసూళ్లు రూ. 89,885కోట్లుగా నమోదయ్యాయని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు.
Samayam Telugu gst1


ఈ-వే బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత వచ్చిన మెరుగైన ప్రదర్శనను ఇది ప్రతిబింబిస్తుందని ఆదియా పేర్కొన్నారు. మార్చి నెల జీఎస్టీ పరిహారం కింద మే 29న రాష్ట్రాలకు రూ. 6696కోట్లు విడుదల చేశారు. దీంతో జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన నాటి(జులై, 2017) నుంచి మార్చి, 2018 వరకు రాష్ట్రాలకు అందించిన జీఎస్టీ పరిహారం రూ. 47,844కోట్లుగా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.