యాప్నగరం

GST Council Meeting: నిర్మలమ్మ నేతృత్వంలో జీఎస్‌టీ మండలి భేటీ.. వీటిపై రేట్ల తగ్గింపు.. ఎంత శాతమంటే?

GST Council Meeting: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 49వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం శనివారం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు వస్తువులపై జీఎస్‌టీ రేట్లను తగ్గించారు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారంపై కూడా కీలక ప్రకటన చేశారు.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 18 Feb 2023, 10:28 pm
GST Council Meeting: 49వ జీఎస్‌టీ మండలి (GST Council) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో లభ్యమయ్యే రాబ్ (లిక్విడ్ బెల్లం), షార్ప్‌నర్స్, పెన్సిళ్లపై పన్ను రేటును తగ్గించారు. వార్షికాదాయానికి సంబంధించి రిటర్న్స్ ఫైలింగ్ ఆలస్యంపై విధించే ఫీజు కూడా హేతుబద్ధీకరించారు. ఇక దిల్లీలో జరిగిన GST కౌన్సిల్ భేటీ అనంతరం.. ఆ సమావేశం వివరాలను ఆర్థిక మంత్రి మీడియాకు వెల్లడించారు.
Samayam Telugu NIRMALA SITARAMAN


పాన్ మసాలా పరిశ్రమలు పన్ను ఎగవేత, గుట్కా, GST అప్పీలేట్ ట్రైబ్యునల్స్ ఏర్పాటుకు సంబంధించి రెండు వేర్వేరు మంత్రివర్గ ఉపసంఘాలు సమర్పించిన నివేదికలను కొన్ని మార్పులతో ఈ భేటీలో ఆమోదించినట్లు వెల్లడించారు నిర్మలా సీతారామన్. వీటిని సభ్యుల అభిప్రాయాల కోసం పంపిస్తామని, తర్వాత ఛైర్మన్ ఆమోదించనున్నట్లు ఆర్థిక శాఖ వివరించింది.

Elon Musk: ఉద్యోగుల్ని అర్ధరాత్రి లేపి మస్క్ అంత పని చేయిస్తున్నారా? చెలరేగిన దుమారం..! Gurugram Woman: టెలిగ్రాంలో యూట్యూబ్ వీడియోలు చూస్తూ రూ.10 లక్షలు పోగొట్టుకుంది.. మీరు ఈ తప్పు చేస్తున్నారా?

2022 జూన్‌కు సంబంధించి రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహార బకాయిలు మొత్తం రూ.16 వేల 982 కోట్లను విడుదల చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుతం ఈ నిధులను కేంద్రం.. తన సొంత నిధుల నుంచి ఇస్తోందని, ఇక భవిష్యత్తులో సెస్‌ల ద్వారా సమకూరే మొత్తంతో ఆ నిధుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 2017 GST చట్టం ప్రకారం.. ఐదేళ్ల కాలానికి చెల్లించాల్సిన పరిహారం మొత్తాన్ని చెల్లించినట్లేనని నిర్మలమ్మ స్పష్టం చేశారు. ఈ పరిహార బకాయిల కింద ఆంధ్ర ప్రదేశ్‌కు రూ.689 కోట్లు, తెలంగాణకు రూ.548 కోట్లు అందనున్నాయి.

లిక్విడ్ బెల్లంపై జీఎస్‌టీ రేటును 18 శాతం నుంచి సున్నాకు తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ బెల్లం ప్యాకింగ్ చేస్తే 5 శాతం, విడిగా అమ్మితే ఎలాంటి ట్యాక్స్ ఉండదని పేర్కొన్నారు. పెన్సిల్, షార్ప్‌నర్‌పై కూడా 18 శాతం నుంచి జీఎస్‌టీ రేటును 12 శాతానికి చేర్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి GSTR-9 దాఖలు విషయంలోనూ ఆలస్య రుసుం హేతుబద్ధీకరించారు. రూ.5 కోట్ల వరకు ఆలస్య రుసుం రోజుకు రూ.50గా, రూ.50-20 కోట్ల టర్నోవర్ కలిగిన వారికి రోజుకు 100 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడు ఈ ఫీజు రూ.200గా ఉంది.

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.