HCLTech Results: దేశంలోనే మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన హెచ్సీఎల్ టెక్నాలజీస్ శుక్రవారం రోజు (ఏప్రిల్ 26న) జనవరి- మార్చి (Q4) త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది. ఈ సమయంలోనే ఉద్యోగుల సంఖ్యపైనా ప్రకటన చేసింది. అయితే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మాదిరిగా కాకుండా.. దీంట్లో మాత్రం ఉద్యోగుల సంఖ్య మళ్లీ పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో ఈ సంస్థలో ఉద్యోగుల సంఖ్య 2725 పెరిగింది. కొత్తగా 2096 మంది ఫ్రెషర్లు చేరడం విశేషం. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరంలో చూస్తే మాత్రం.. ఈ కంపెనీలో 12,141 మంది ఫ్రెషర్లు చేరారు. కంపెనీ ఉద్యోగుల సంఖ్య మొత్తంగా ఇప్పుడు 2,27,481 కి చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో 1537 మంది ఉద్యోగుల్ని పెంచుకుంది.
ఇక ఈ కంపెనీలో అట్రిషన్ రేటు వరుసగా తగ్గుతూ వస్తోంది. అక్టోబర్- డిసెంబర్ క్వార్టర్లో అట్రిషన్ రేటు 12.8 శాతంగా ఉండగా.. ఇప్పుడు అది 12.4 శాతానికి దిగొచ్చింది. 2021లో కొవిడ్ విజృంభించినప్పటి నుంచి అట్రిషన్ రేటు ఇదే కనిష్టం కావడం విశేషం.
ఒక్క హెచ్సీఎల్ సంస్థలో మాత్రం ప్రస్తుత త్రైమాసికంలో, అదే విధంగా పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు పెరగడం విశేషం అని చెప్పొచ్చు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో చూసినట్లయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య ఏకంగా 13,249 తగ్గింది. Q4 లో 1759 మంది తగ్గారు. ఇన్ఫోసిస్ పూర్తి ఉద్యోగులు 25,994 తగ్గారు. సమీక్షా త్రైమాసికంలో మాత్రం 5423 తగ్గిపోయింది. విప్రోలో ఈ సంఖ్య 24,516 గా ఉంది. జనవరి- మార్చి సమయంలో ఉద్యోగులు 6180 తగ్గారు. టెక్ మహీంద్రాలో కూడా ఉద్యోగుల సంఖ్య 6945 మంది తగ్గారు. గత 3 నెలల కాలంలో 795 మంది తగ్గిపోయారు.
హెచ్సీఎల్ టెక్నాలజీస్ మినహాయించి ఈ నాలుగు కంపెనీల్లో చూస్తే ఉద్యోగుల సంఖ్య 70,704 పడిపోయింది. హెచ్సీఎల్ టెక్నాలజీస్లో మూడో త్రైమాసికంలో కూడా ఉద్యోగుల సంఖ్య 3617 పెరిగింది.
శుక్రవారం రోజు ఫలితాల్ని ప్రకటించింది హెచ్సీఎల్ టెక్నాలజీస్. అయితే అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభం పెద్దగా పెరగలేదు. ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ. 3986 కోట్లుగా నమోదైంది. ఆదాయం మాత్రం 7 శాతానికిపైగా పెరిగి రూ. 28 వేల కోట్ల పైచిలుకు నమోదు చేసింది. అట్రిషన్ రేటు కూడా దిగొచ్చింది. మరోవైపు డివిడెండ్ కూడా ప్రకటించింది. ఒక్కో షేరుపై రూ.18 డివిడెండ్ ఇస్తామని వెల్లడించింది. ర
ఇక ఈ కంపెనీలో అట్రిషన్ రేటు వరుసగా తగ్గుతూ వస్తోంది. అక్టోబర్- డిసెంబర్ క్వార్టర్లో అట్రిషన్ రేటు 12.8 శాతంగా ఉండగా.. ఇప్పుడు అది 12.4 శాతానికి దిగొచ్చింది. 2021లో కొవిడ్ విజృంభించినప్పటి నుంచి అట్రిషన్ రేటు ఇదే కనిష్టం కావడం విశేషం.
ఒక్క హెచ్సీఎల్ సంస్థలో మాత్రం ప్రస్తుత త్రైమాసికంలో, అదే విధంగా పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు పెరగడం విశేషం అని చెప్పొచ్చు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో చూసినట్లయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య ఏకంగా 13,249 తగ్గింది. Q4 లో 1759 మంది తగ్గారు. ఇన్ఫోసిస్ పూర్తి ఉద్యోగులు 25,994 తగ్గారు. సమీక్షా త్రైమాసికంలో మాత్రం 5423 తగ్గిపోయింది. విప్రోలో ఈ సంఖ్య 24,516 గా ఉంది. జనవరి- మార్చి సమయంలో ఉద్యోగులు 6180 తగ్గారు. టెక్ మహీంద్రాలో కూడా ఉద్యోగుల సంఖ్య 6945 మంది తగ్గారు. గత 3 నెలల కాలంలో 795 మంది తగ్గిపోయారు.
హెచ్సీఎల్ టెక్నాలజీస్ మినహాయించి ఈ నాలుగు కంపెనీల్లో చూస్తే ఉద్యోగుల సంఖ్య 70,704 పడిపోయింది. హెచ్సీఎల్ టెక్నాలజీస్లో మూడో త్రైమాసికంలో కూడా ఉద్యోగుల సంఖ్య 3617 పెరిగింది.
శుక్రవారం రోజు ఫలితాల్ని ప్రకటించింది హెచ్సీఎల్ టెక్నాలజీస్. అయితే అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభం పెద్దగా పెరగలేదు. ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ. 3986 కోట్లుగా నమోదైంది. ఆదాయం మాత్రం 7 శాతానికిపైగా పెరిగి రూ. 28 వేల కోట్ల పైచిలుకు నమోదు చేసింది. అట్రిషన్ రేటు కూడా దిగొచ్చింది. మరోవైపు డివిడెండ్ కూడా ప్రకటించింది. ఒక్కో షేరుపై రూ.18 డివిడెండ్ ఇస్తామని వెల్లడించింది. ర