యాప్నగరం

HDFC Bank: కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్.. హెచ్‌డీఎఫ్‌సీ కీలక ప్రకటన.. ఆ ఛార్జీలు భారీగా పెంపు!

HDFC Bank: దేశీయ ప్రైవేటు రంగంలోని దిగ్గజ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. వ్యక్తిగత రుణాలపై వివిధ రకాల ఛార్జీలు, ఫీజులను సవరించింది. ఈ బ్యాంకులో రుణాలు తీసుకున్న వారు ఇకపై అదనపు భారం పడనుంది. సవరించిన ఛార్జీలు మార్చి 24 నుంచే అమలులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో పెంచిన కొత్త ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 26 Mar 2023, 3:11 pm
Samayam Telugu hdfc bank
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
HDFC Bank: మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమరా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. ప్రైవేటు రంగంలోని దిగ్గజ బ్యాంకు అయినా హెచ్‌డీఎఫ్‌సీలో వ్యక్తిగత రుణాల వంటి అన్‌సెక్యూర్డ్ రుణాలపై వివిధ ఛార్జీలు (Personal Loan Charges), ఫీజులను సవరించింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం సవరించిన ఛార్జీలు మార్చి 24, 2023 నుంచే అమలులోకి వచ్చాయి. ఈ మేరకు తమ కస్టమర్లకు ఎస్ఎంఎస్‌ల ద్వారా సైతం సమాచారం అందించింది. తాజా నిర్ణయంతో బ్యాంక్ (HDFC Bank) కస్టమర్లపై ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో సవరించిన కొత్త ఛార్జీలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.

ప్రీ పేమెంట్ ఛార్జీలు..

  • ఏడాది లోపు ఉన్న రుణాలపై ప్రీ పేమెంట్ చేయడానికి లేదు.
  • 13 నెలల నుంచి 24 నెలలోపు ఉన్న రుణాలను ముందస్తుగా చెల్లించాలనుకున్నప్పుడు లోన్ మొత్తంగా 4 శాతం ఛార్జీలు వసూలు చేస్తారు.
  • 25 నెలల 36 నెలల రుణాలకు ప్రీమెంట్ ఛార్జీలు 3 శాతంగా నిర్ణయించింది బ్యాంక్.
  • 36 నెలలకుపైన ఉన్న రుణాలకు ప్రీమెంట్ ఛార్జీలు 2 శాతంగా ఉన్నాయి.
  • లోన్‌లో కొంత భాగాన్ని ఒకేసారి చెల్లించేందుకు 12 నెలల ఈఎంఐ చెల్లించిన తర్వాతే అనుమతిస్తున్నారు. 25 శాతం లోన్ మొత్తంగా చెల్లించవచ్చు. అయితే ఇది ఆర్థిక ఏడాదిలో ఒకేసారి అనుమతిస్తారు. అలాగే లోన్ టెన్యూర్‌లో రెండు సార్లు మాత్రమే ఇలా చెల్లించవచ్చు.
  • జీఎస్‌టీ, ఇతర ప్రభుత్వ చార్జీలు, లేవీలు సమయానుసారంగా విధిస్తుంది బ్యాంక్ ఇది అదనంగా ఉంటుంది.
ప్రీ మెచ్యూర్ క్లోజర్ ఛార్జీలు..
  • పూర్తి స్థాయిలో రుణాలను ప్రీమెచ్యూర్ క్లోజ్ చేయాలని భావిస్తే 24 నెలల వరకు అయితే 4 శాతం ఛార్జీ పడుతుంది.
  • అదే 24 నెలల తర్వాత నుంచి 36 నెలల వరకు అయితే 3 శాతం ఛార్జీలు పడతాయి.
  • 36 నెలల తర్వాత అయితే 2 శాతం ఛార్జీ చెల్లించాలి.
  • దీనికి కూడా జీఎస్‌టీ, ఇతర చార్జీలు అదనం
మరోవైపు.. తొలి ఈఎంఐ చెల్లించిన తర్వాత పార్షియల్ ప్రీమెచ్యూర్ పేమెంట్స్ చేయొచ్చు. 24 ఈఎంఐలలోపు అయితే, పార్ట్‌మెంట్ అమౌంట్‌పై 4 శాతం ఛార్జీ పడుతుంది. అదే 24 నుంచి 36 నెలలలోపు అయితే 3 శాతం ఛార్జీలు పడతాయి. 36 నెలల తర్వాత అయితే 2 శాతం పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. జీఎస్‌టీ, ఇతర ట్యాక్సులు అదనం. అలాగే టర్మ్ లోన్స్‌కు సంబంధంచి ఈఎంఐ కట్టకపోతే చెల్లించాల్సిన ఈఎంఐతో పాటు జీఎస్‌టీ వంటివి అదనంగా చెల్లించాల్సి వస్తుంది. దాంతో పాటు 18 శాతం ఫీజు చెల్లించాలి.

రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.