SBI, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి..
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. అలాగే ఎల్ఐసీ పాలసీదారులకు కూడా ముఖ్యమైన గమనిక. ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. కొన్ని దిగ్గజ బ్యాంకులు ఇంకా వీటిని అనుసరించడం లేదు.
Samayam Telugu 27 Mar 2021, 12:02 pm
ప్రధానాంశాలు:
- ట్రాయ్ కొత్త రూల్స్
- ఏప్రిల్ నుంచి అమలులోకి
- ఇప్పటికీ ఫాలో కానీ బ్యాంకులు
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI, ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, లేదంటే ప్రైవేట్ రంగానికే చెందిన మరో ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్లో అకౌంట్ కలిగి ఉన్నారా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా ఒక డిఫాల్టర్స్ జాబితాను విడుదల చేసింది. ఇందులో పైన పేర్కొన్న బ్యాంకులు అన్నీ ఉన్నాయి. ఇంకా ఎల్ఐసీ కూడా లిస్ట్లో ఉంది. ఇవ్వన్నీ ఇంకా ట్రాయ్ కొత్త ఎస్ఎంఎస్ నిబంధనలను అనుసరించడం లేదు. ఏప్రిల్ 1 నుంచి ట్రాయ్ కొత్త ఎస్ఎంఎస్ రూల్స్ అమలులోకి వస్తాయి.
Also Read: undefined
ఈలోపు అన్ని సంస్థలు, బ్యాంకులు కొత్త రూల్స్ను అనుసరించాల్సి ఉంటుంది. లేదంటే బ్యాంక్ నుంచి ఖాతాదారులకు ఎస్ఎంఎస్లు రాకపోవచ్చు. కొత్త రూల్స్ను అనుసరించి సంస్థలు, బ్యాంకుల నుంచి వచ్చే ఎస్ఎంఎస్లను టెలికం కంపెనీలు బ్లాక్ చేస్తాయి.
ఇప్పటికే ట్రాయ్.. ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని సంస్థలు, డిపార్ట్మెంట్లను కొత్త ఎస్ఎంఎస్ రూల్స్ను అనుసరించాలని కోరింది. అంటే ఈ సంస్థలు అన్నీ వాటి ఎస్ఎంఎస్ టెంప్లేట్స్ను టెలికం ఆపరేటర్ల వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పామ్ మెసేజ్లను అడ్డుకొనేందుకు, ఆన్లైన్ మోసాలను తగ్గించేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకువస్తోంది.
Also Read: undefined
ఈలోపు అన్ని సంస్థలు, బ్యాంకులు కొత్త రూల్స్ను అనుసరించాల్సి ఉంటుంది. లేదంటే బ్యాంక్ నుంచి ఖాతాదారులకు ఎస్ఎంఎస్లు రాకపోవచ్చు. కొత్త రూల్స్ను అనుసరించి సంస్థలు, బ్యాంకుల నుంచి వచ్చే ఎస్ఎంఎస్లను టెలికం కంపెనీలు బ్లాక్ చేస్తాయి.
ఇప్పటికే ట్రాయ్.. ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని సంస్థలు, డిపార్ట్మెంట్లను కొత్త ఎస్ఎంఎస్ రూల్స్ను అనుసరించాలని కోరింది. అంటే ఈ సంస్థలు అన్నీ వాటి ఎస్ఎంఎస్ టెంప్లేట్స్ను టెలికం ఆపరేటర్ల వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పామ్ మెసేజ్లను అడ్డుకొనేందుకు, ఆన్లైన్ మోసాలను తగ్గించేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకువస్తోంది.