యాప్నగరం

Hero బైక్ కొనాలనుకుంటున్నారా? వెంటనే కొనేయండి.. ధరలు పెరుగుతున్నాయ్!

Hero MotoCorp: కొత్త బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి షాక్ ఇచ్చింది దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్. మరోసారి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ బండి కొనాలనుకునే వారు వెంటనే కొనేయడం మంచిది. మరో వారంలో ధరలు భారీగా పెరగనున్నాయి. బైకులు, స్కూటర్లలో వివిధ మోడళ్లపై ధరల పెంపు ఉంటుందని హీరో మోటోకార్ప్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 22 Mar 2023, 8:05 pm
Hero MotoCorp: దేశీయ దిగ్గజ టూ-వీలర్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ బుధవారం కీలక ప్రకటన చేసింది. మరోసారి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించి తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. తమ కంపెనీకి చెందిన పలు మోడళ్ల మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలు ఏప్రిల్ 1 నుంచి 2 శాతం మేర పెంచుతున్నట్లు స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్‌లో పేర్కొంది. కర్బన ఉద్గారాల నిబంధనలు పాటించడంలో భాగంగా ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిపోతోందని, అందుకే వాహనాల ధరలు పెంచే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో హీరో బైక్ (hero bike price hyderabad) తీసుకోవాలని భావిస్తున్న వారు వెంటనే కొనుగోలు చేసుకోవడం మంచిది. ఏప్రిల్ 1 తర్వాత హీరో వాహనాలు మరింత ప్రియం కానున్నాయి.
Samayam Telugu hero MotoCorp
హీరో మోటోకార్ప్


హీరో మోటోకార్ప్ (Hero MotoCorp Vehicles) ప్రకటించిన తాజా నిర్ణయంతో ఆ కంపెనీకి చెందిన అన్ని మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్ షోరూమ్ ధరలు ఏప్రిల్ 1 నుంచి మారనున్నాయి. మోడల్‌ను అనుసరించి మార్కెట్‌ను బట్టి ఈ ధరల పెంపు వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. బీఎస్-6 ఫేజ్-2 ఉద్గార ప్రమాణాలను పాటించడంలో భాగంగా ధరలు పెంచేందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని హీరో మోటో కార్ప్ తెలిపింది. 'ఓబీడీ-2 ట్రాన్సిషన్ కారణంగా ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. దీంతో వాహనాల ధరలు సవరించాల్సి వస్తోంది. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హీరో మోటో కార్పు అధునాతన ఫైనాన్షింగ్ సొల్యూషన్స్‌ను కొనసాగిస్తూనే ఉంటుంది. రూరల్ మార్కెట్ డిమాండ్ పెరుగుతోంది. సోషల్ సెక్టార్‌లో ప్రభుత్వ పథకాలు తీసుకురావడంపై మా కృతజ్ఞతలు. రానున్న పండుగల సీజన్‌లో డిమాండ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నాం.' అని తెలిపింది హీరో మోటో కార్ప్.

గతం ఏడాది 2022 డిసెంబర్‌లోనూ హీరో తన వాహనాల ధరలను పెంచింది. మరోవైపు.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న ఉద్గార నిబంధనలకు అనుగుణంగా హీరో సహా ఇతర కంపెనీలు సైతం కొత్త ఉద్గార ప్రమాణాలను అందుకునేందుకు తమ వాహనాల్లో మార్పులు చేస్తున్నాయి. ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ను ఏర్పాటు చేస్తున్నాయి. దీని ద్వారా వాహనం నుంచి ఎంతెంత ఉద్గారాలు విడుదల అవుతున్నాయో తెలుసుకునే వీలుంటుంది. హీరో మోటోకార్ప్ ఇటీవల భారత్‌లో సరికొత్త జూమ్ 110ని విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.68,599గా ఉంది. దీంతో పాటు సూపర్ స్ప్లెండర్ హైటెక్ XTEC వేరియంట్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.83,368గా నిర్ణయించింది హీరో మోటో కార్ప్. హీరో మోటోకార్ప్ తమ వాహనాల ధరల పెంపు కొద్ది కాలంలోనే ఇది రెండోసారి. మరోవైపు.. టాటా మోటార్స్ సైతం తాజాగా తమ కమర్షియల్ వాహనాల ధరలను 5 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.


రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.