GST : లగ్జరీ, హానికరమైన ఉత్పత్తులపై అత్యధిక జీఎస్టీ 28 శాతం కొనసాగుతుందని రెవెన్యూ సెక్రటరీ తరుణ్ బజాజ్ క్లారిటీ ఇచ్చారు. వీటిపై అత్యధిక జీఎస్టీ శ్లాబును కొనసాగించడమే ప్రభుత్వం ఉద్దేశ్యమని పేర్కొన్నారు. మూడు శ్లాబులు 5 శాతం, 12 శాతం, 18 శాతాలను రెండుగా కుదించడంపై చర్చలు జరుగుతున్నాయని తరుణ్ బజాజ్ చెప్పారు. చాలా కాలంగా పెట్రోలియం ప్రొడక్టులను జీఎస్టీ కిందకు తీసుకురావాలని ఇండస్ట్రీ డిమాండ్ చేస్తుందని తరుణ్ బజాజ్ చెప్పారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూల్లో అత్యధిక భాగం కలిగి ఉన్న ఫ్యూయల్ను జీఎస్టీ కిందకు తీసుకురావడంపై అవి కాస్త విముఖతతో ఉన్నాయని అన్నారు. కొంత కాలం పాటు తాము వేచి చూడాల్సి ఉందన్నారు.
5 శాతం, 12 శాతం,18 శాతం, 28 శాతం శ్లాబులలో.. 28 శాతం రేటును తాము కొనసాగిస్తామని తెలిపారు. అభివృద్ధి చెందుతోన్న దేశాలలో ఆదాయ అంతరాయాలు ఉంటాయని అన్నారు. దీని కోసం కొన్నిలగ్జరీ, హానికరమైన ఉత్పత్తులపై అత్యధిక పన్ను వర్తించాల్సి ఉందని తెలిపారు. అయితే 5, 12, 18 శాతం జీఎస్టీ రేట్లను రెండు రేట్లకు కుదించవచ్చన్నారు. ఆ తర్వాత దేశం ఎలా అభివృద్ధి చెందుతుందో చూడాలని అసోచామ్ ఈవెంట్లో తరుణ్ బజాజ్ అన్నారు. ఈ రేట్లను ఒక రేటుకు తీసుకురాగలమా..? లేదా..? అన్నది చూడాల్సి ఉందని, ఇది చాలా సవాలుతో కూడుకున్న విషయమని బజాజ్ అన్నారు.
నాలుగు శ్లాబుల జీఎస్టీ కింద, నిత్యావసర వస్తువులపై 5 శాతం జీఎస్టీని విధిస్తుండగా.. లగ్జరీ కార్లపై 28 శాతం లెవీని విధిస్తోంది. ఇతర పన్ను రేట్లు 12 శాతం, 18 శాతంగా ఉన్నాయి. గోల్డ్, జ్యూవెల్లరీ, విలువైన రాళ్లపై స్పెషల్గా 3 శాతం జీఎస్టీ ఉంది. కట్, పాలిష్డ్ డైమండ్లపై 1.5 శాతం జీఎస్టీని ప్రభుత్వం విధిస్తోంది. లగ్జరీ, సిన్, డీమెరిట్ గూడ్స్పై అత్యధికంగా 28 శాతం పన్నును, సెస్ను ప్రభుత్వం విధిస్తోంది. ఈ సెస్ను పరిహారాల నిధిలో జమ చేస్తోంది. ఇలా జమ చేసిన మొత్తాన్ని జీఎస్టీ అమల్లోకి వచ్చాక రెవెన్యూలు నష్టపోతున్న రాష్ట్రాలకు పరిహారాలుగా అందిస్తోంది.
Also Read : రూ.5 లక్షల కోట్ల ఉద్యోగం వదులుకున్న సీఈవో.. సముద్రాన్ని చూస్తూ కూర్చోవాలనుందట!
Also read : ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే లాభమేనా..?
5 శాతం, 12 శాతం,18 శాతం, 28 శాతం శ్లాబులలో.. 28 శాతం రేటును తాము కొనసాగిస్తామని తెలిపారు. అభివృద్ధి చెందుతోన్న దేశాలలో ఆదాయ అంతరాయాలు ఉంటాయని అన్నారు. దీని కోసం కొన్నిలగ్జరీ, హానికరమైన ఉత్పత్తులపై అత్యధిక పన్ను వర్తించాల్సి ఉందని తెలిపారు. అయితే 5, 12, 18 శాతం జీఎస్టీ రేట్లను రెండు రేట్లకు కుదించవచ్చన్నారు. ఆ తర్వాత దేశం ఎలా అభివృద్ధి చెందుతుందో చూడాలని అసోచామ్ ఈవెంట్లో తరుణ్ బజాజ్ అన్నారు. ఈ రేట్లను ఒక రేటుకు తీసుకురాగలమా..? లేదా..? అన్నది చూడాల్సి ఉందని, ఇది చాలా సవాలుతో కూడుకున్న విషయమని బజాజ్ అన్నారు.
నాలుగు శ్లాబుల జీఎస్టీ కింద, నిత్యావసర వస్తువులపై 5 శాతం జీఎస్టీని విధిస్తుండగా.. లగ్జరీ కార్లపై 28 శాతం లెవీని విధిస్తోంది. ఇతర పన్ను రేట్లు 12 శాతం, 18 శాతంగా ఉన్నాయి. గోల్డ్, జ్యూవెల్లరీ, విలువైన రాళ్లపై స్పెషల్గా 3 శాతం జీఎస్టీ ఉంది. కట్, పాలిష్డ్ డైమండ్లపై 1.5 శాతం జీఎస్టీని ప్రభుత్వం విధిస్తోంది. లగ్జరీ, సిన్, డీమెరిట్ గూడ్స్పై అత్యధికంగా 28 శాతం పన్నును, సెస్ను ప్రభుత్వం విధిస్తోంది. ఈ సెస్ను పరిహారాల నిధిలో జమ చేస్తోంది. ఇలా జమ చేసిన మొత్తాన్ని జీఎస్టీ అమల్లోకి వచ్చాక రెవెన్యూలు నష్టపోతున్న రాష్ట్రాలకు పరిహారాలుగా అందిస్తోంది.
Also Read : రూ.5 లక్షల కోట్ల ఉద్యోగం వదులుకున్న సీఈవో.. సముద్రాన్ని చూస్తూ కూర్చోవాలనుందట!
Also read : ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే లాభమేనా..?