యాప్నగరం

మరో రెండేళ్లలో దేశంలో టోల్ ప్లాజాలు మాయం: నితిన్ గడ్కరీ

సంక్రాతి సీజన్లో హైదరాబాద్ నుంచి విజయవాడ బయల్దేరి వెళ్తే.. టోల్ ప్లాజాల దగ్గర ఎంత సేపు ఆగాల్సి వస్తుందో తెలిసిందే. ఈ సమస్య పరిష్కారం కోసం ఫస్టాగ్‌లను తీసుకొచ్చిన కేంద్రం.. వచ్చే రెండేళ్లలో అసలు టోల్ ప్లాజాలే ఉండవంటోంది.

Samayam Telugu 18 Dec 2020, 8:05 am
వచ్చే రెండేళ్లలో మన దేశంలో టోల్ బూత్‌లేవీ కనిపించబోవు. అంటే టోల్ ఫీజు వసూలు చేయడం ఆపేస్తారని మాత్రం అనుకోవద్దు. టోల్ వసూలు కోసం జీపీఎస్ ఆధారిత టెక్నాలజీని ప్రభుత్వం ఫైనలైజ్ చేసిందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ టెక్నాలజీతో వాహనాలు టోల్ గేట్ దగ్గర ఆగాల్సిన అవసరం లేకుండా దూసుకెళ్లొచ్చు.
Samayam Telugu highways to be toll booth free in next two years says nitin gadkari
మరో రెండేళ్లలో దేశంలో టోల్ ప్లాజాలు మాయం: నితిన్ గడ్కరీ


అసోచామ్ ఫౌండేషన్ వీక్ ప్రోగ్రాంలో పాల్గొన్న గడ్కరీ.. ఈ విషయాలను వెల్లడించారు. వాహనం కదలికల ఆధారంగా నేరుగా వాహనదారుడి బ్యాంకు ఖాతా నుంచి టోల్ అమౌంట్ కట్ అవుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం కమర్షియల్ వాహనాల్లో వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంది. పాత వాహనాల్లోనూ జీపీఎస్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తామని గడ్కరీ తెలిపారు.

మార్చి నాటికి టోల్ వసూళ్లు రూ.34 వేల కోట్లకు చేరుతాయని గడ్కరీ వెల్లడించారు. జీపీఎస్ టెక్నాలజీ వాడటం ద్వారా టోల్ ఆదాయం వచ్చే ఐదేళ్లలో రూ.1.34 లక్షల కోట్లకు పెరుగుతుందన్నారు. మౌలికవసతుల అభివృద్ధి కోసం పబ్లిక్-ప్రయివేట్ ఇన్వెస్ట్‌మెంట్‌‌ను ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. ఆర్థికంగా లాభదాయకం కాని ప్రాజెక్టులకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.