యాప్నగరం

Hyderabad: కూకట్‌పల్లిలో 264 ఎకరాలకు రూ.3402 కోట్లు.. దిగ్గజ సంస్థ విక్రయం!

GOCL Hyderabad: హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఓ దిగ్గజ సంస్థ వందల ఎకరాలు విక్రయానికి పెట్టింది. 264 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఆ వివరాలు ఓసారి తెలుసుకుందాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 31 Mar 2024, 1:01 pm
Hyderabad: హైదరాబాద్ మహానగరంలో రియల్ఎస్టేట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. నలుదిక్కల భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏ ప్రాంతంలో చూసిన ధరలు కోట్లలోనే పలుకుతున్నాయి. తాజాగా ఓ దిగ్గజ సంస్థ వందల ఎకరాల భూమిని విక్రయానికి పెట్టింది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఉన్న తమ 264.50 ఎకరాలు విక్రయిస్తోంది హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ (GOCL Corporation). ఒక్కో ఎకరానికి సుమారు రూ.12.87 కోట్ల చొప్పున విక్రయిస్తున్నట్లు బుధవారం వెల్లడించింది. మొత్తం 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది.
Samayam Telugu Kukatpally


ఈ విక్రయంలో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్వ్కేర్ స్పేస్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకున్నట్లు జీఓసీఎల్ తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా 32 ఎకరాల స్థలాన్ని హిందూజా హెల్త్‌కేర్ లిమిటెడ్ (హెచ్ఎచ్ఎల్ గతంలో హిందూజా ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెట్) తో కలిసి అభివృద్ధి చేసేలా జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ (JDA) కుదుర్చుకున్నట్లు వివరించింది. ఈ ప్రక్రియ మొత్తం రానున్న 18 నెలల్లో పూర్తి కావాల్సి ఉందని తెలిపింది.

264 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయిస్తుండగా.. ఈ డీల్‌లో భాగంగా మొదటి వాయిదా కింద రూ.520 కోట్లను అందుకుంటామని జీఓసీఎల్ వెల్లడించింది. జేడీఏ కింద అభివృద్ధి చేయనున్న 32 ఎకరాల్లో 12.50 ఎకరాలను వెంటనే విక్రయిస్తామని పేర్కొంది. తమకు మొదటి వాయిదాగా అందే రూ.502 కోట్లలో.. రూ.160 కోట్లు ఈ 12.50 ఎకరాల అమ్మకం ద్వారానే లభిస్తాయని తెలిపింది. తదుపరి దశల్లో జరిగే విక్రయాల ద్వారా మిగిలిన నిధులు కంపెనీకి సమకూరుతాయని తెలిపింది. జీఓసీఎల్ దాని అనుబంధ సంస్థలు ఎనర్జటిక్స్, కమెర్షియల్ ఎక్స్‌ప్లోసివ్స్ లో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేస్తుంది. ప్రధానంగా డిఫెన్స్, స్పెస్ సెక్టార్ కోసం ప్రత్యేక ఉత్పత్తులను డిజైన్ చేస్తుంటుంది. పేలుడు కోసం ఉపయోగించే ప్రత్యేక మెటల్ క్లాడింగ్ సొల్యూషన్స్ అందిస్తుంటుంది.
రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.