రెచ్చగొట్టే విధంగా పోస్టర్ను ప్రదర్శించిన ట్విటర్ సీఈవో జాక్ డోర్సేపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ విషయంపై తన శాఖ అధికారులు డోర్సేతో మాట్లాడారని అన్నారు. ఇటీవల భారత్లో పర్యటించిన డోర్సే.. పలువురు సామాజిక కార్యకర్తలు, మహిళా జర్నలిస్టులు, రచయితలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. ఓ సందేశంతో కూడిన పోస్టర్ను జాక్ డోర్సే ప్రదర్శించడం వివాదాస్పదమైంది. సంబంధిత చిత్రం వైరల్గా మారడంతో పాటు ట్విటర్పైనా, సీఈవో డోర్సేపైనా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువత్తాయి.
వివరాల్లోకి వెళితే.. ట్విట్టర్ సీఈవో డోర్సే తన భారత పర్యటనలో ఇటీవల కొందరు మహిళా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రచయిత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ సామాజిక కార్యకర్త బహూకరించిన ఓ పోస్టర్తో ఫొటో దిగారు. సంబంధిత ఫొటోను ఓ జర్నలిస్టు ట్వీట్ చేస్తూ భారత్లో ట్విట్టర్ పనితీరుపై చర్చించామని పేర్కొన్నారు. అయితే, సంబంధిత పోస్టర్ను డోర్సే ప్రదర్శించడం వివాదాస్పదమైంది. ‘బ్రాహ్మణిక పితృస్వామ్యం నశించాలి’ అని అందులో ఉండడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు ఆయనపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.
తమ సీఈవోపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ట్విట్టర్ వివరణ ఇచ్చుకుంది. సమావేశం సందర్భంగా ఓ సామాజిక కార్యకర్త తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు తమ సీఈవోకు పోస్టర్ను బహూకరించారని తెలిపింది. అది ట్విట్టర్ గానీ, సీఈవో అభిప్రాయం గానీ కాదని చెబుతూ.. క్షమాపణ కూడా చెప్పింది.
వివరాల్లోకి వెళితే.. ట్విట్టర్ సీఈవో డోర్సే తన భారత పర్యటనలో ఇటీవల కొందరు మహిళా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రచయిత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ సామాజిక కార్యకర్త బహూకరించిన ఓ పోస్టర్తో ఫొటో దిగారు. సంబంధిత ఫొటోను ఓ జర్నలిస్టు ట్వీట్ చేస్తూ భారత్లో ట్విట్టర్ పనితీరుపై చర్చించామని పేర్కొన్నారు. అయితే, సంబంధిత పోస్టర్ను డోర్సే ప్రదర్శించడం వివాదాస్పదమైంది. ‘బ్రాహ్మణిక పితృస్వామ్యం నశించాలి’ అని అందులో ఉండడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు ఆయనపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.
తమ సీఈవోపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ట్విట్టర్ వివరణ ఇచ్చుకుంది. సమావేశం సందర్భంగా ఓ సామాజిక కార్యకర్త తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు తమ సీఈవోకు పోస్టర్ను బహూకరించారని తెలిపింది. అది ట్విట్టర్ గానీ, సీఈవో అభిప్రాయం గానీ కాదని చెబుతూ.. క్షమాపణ కూడా చెప్పింది.